Telegram Scam: వెలుగులోకి టెలిగ్రామ్ కుంభకోణం.. సెబీ సోదాలు.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు సంబంధించి ఓ స్కాం తాజాగా వెలుగు చూసింది. టెలిగ్రామ్ను ఉపయోగించుకుని షేర్ల ట్రేడింగ్ కుంభకోణానికి పలు సంస్థలు తెరతీశాయని ఆరోపణలు రావడంతో సెబీ రంగంలోకి దిగింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సెబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు టెలిగ్రామ్ ద్వారా 50 లక్షలకు పైగా సబ్స్క్రైబర్ల కోసం రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు వీటిలో లావాదేవీలు చేపట్టేలా స్కాంకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది.
ఈ మేరకు గుజరాత్లోని అహ్మదాబాద్, భావనగర్, మధ్యప్రదేశ్లోని నీముచ్, ఢిల్లీ, ముంబైలలో సోదాలు చేసినట్లు సెబీ వెల్లడించింది. ఈ సోదాల ద్వారా 34 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, 4 డెస్క్టాప్లు, 4 ట్యాబ్లెట్లతోపాటు.. 2 హార్డ్ డిస్కులు, పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సెబీ తెలిపింది. కాగా కృత్రిమంగా సబ్స్క్రైబర్లను సృష్టించి ఇన్వెస్టర్ల ద్వారా లావాదేవీలు పెరిగినట్లు చూపించి ధరల పెరుగుదలకు దారిచూపినట్లు టెలిగ్రామ్పై ఆరోపణలున్నాయి. దీంతో ఆయా సంస్థలు అధిక ధరల వద్ద షేర్లను విక్రయించేందుకు అవకాశం కలిగింది. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోగా.. ఈ సంస్థలు మాత్రం ధనార్జన పొందినట్లు తెలుస్తోంది.
Also Read
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
తాజావార్తలు
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
-
Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!