SBI : ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. పెరిగిన వడ్డీ రేట్లు..ఎంతంటే?
- దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ
- ఖాతాదారులకు చేదు వార్త చెప్పిన ఎస్బీఐ
- వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంటే మరోవైపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను (SBI MCLR పెంపు) 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచింది. ఈ మార్పు వివిధ పదవీకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి నుంచి బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్లో చివరిసారిగా ఎంసీఎల్ఆర్ను సవరించింది. ఇప్పుడు తాజాగా సవరించినట్లు పేర్కొంది.
READ MORE: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
మూడు సంవత్సరాల కాలానికి ఎస్బీఐ యొక్క కొత్త ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 9% నుంచి 9.10%కి పెరిగింది. అయితే ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.10% నుంచి 8.20%కి పెరిగింది. నెల, మూడు నెలల కాల వ్యవధులకు లెండింగ్ రేటు 8.45 శాతం నుంచి 8.5 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతానికి, ఏడాది లెండింగ్ రేటు 8.85 నుంచి 8.95 శాతానికి పెంచింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 9.05 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.1 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
READ MORE: CM Chandrababu: టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..
అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?
ఎంసీఎల్ఆర్ (Marginal Cost of Funds Based Lending Rate) అనేది రుణ రేటుని తెలుపుతుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వడానికి అనుమతి లేదు. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఇటీవల జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందాలనుకున్న రుణగ్రహీతలకు మరోసారి నిరాశే మిగిలింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తేనే వడ్డీరేట్లు సవరించబడతాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!