ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వడ్డింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త ఏడాదిలో అడుపెట్టాం.. జనవరి నెల కూడా పూర్తి కావొచ్చింది.. ఎల్లుండి నుంచి ఫిబ్రవరి మాసం ప్రారంభం కానుంది.. ఇప్పటికే కొత్త ఏడాదిలో కొత్త ఛార్జీలను అమలు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద బ్యాకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ.. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచబోతోంది.. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ వడ్డించనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకే ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
Read Also: 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సినేషన్.. ప్రధాని అభినందనలు..
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
కాగా, ఎస్బీఐ.. యోనో బ్యాంకింగ్ ద్వారా చేసే రూ. 5 లక్షల వరకు ఐఎంపీఎస్ సేవలకు ఎలాంటి సర్వీస్ ఛార్జ్, జీఎస్టీ వర్తించదని తెలిపింది.. కానీ, బ్యాంకుల్లో చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ఐఎంపీఎస్ ఛార్జీని అమలు చేయబోతోంది.. అంటే, ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారులు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పంపితే.. 20 రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.. ఐఎంపీఎస్ లావాదేవీల్లో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే రూ.2తో పాటు జీఎస్టీ అధినంగా చెల్లించాల్సి ఉండగా.. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు లావాదేవీపై రూ. 4తో పాటు జీఎస్టీ, రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై రూ.12తో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తోంది.. ఇక, కొత్త స్లాబ్ ప్రకారం.. రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు లావాదేవీలపై రూ. 20 పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. ఫిబ్రవరి 1వ తేదీ అంటే.. ఎల్లుండి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..