Indian Rupee: రూపాయి పతనంపై దయచేసి ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దు..!
- డాలర్ పెరుగుదలతో పతనమైతున్న రూపాయి విలువ..
- రూపాయి పతనంపై ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. ఎగుమతులపై ప్రభావం పడే ఛాన్స్..
- దేశీయంగా వినియోగం పెంచేందుకు మద్దతు ఇచ్చే చర్యలపై దృష్టి పెట్టాలి: రఘురాం రాజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందుకు బదులుగా మరిన్ని ఉద్యోగాలను సృష్టించి.. దేశీయంగా వినియోగం పెంచేందుకు తగిన మద్దతు ఇచ్చే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది.. అలాగే, ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగానే ఇమిగ్రేషన్, టారిఫ్లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
Read Also: Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
Also Read
- Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
- UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
అలాగే, ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు క్రమంగా బలపడటం.. వివిధ దేశాల ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలే దీనికి ప్రధాన కారణం. టారిఫ్లు పెంచితే, ఇతర దేశాల నుంచి యూఎస్ కి దిగుమతులు తగ్గిపోవడం.. కరెంట్ ఖాతా లోటు, వాణ్యి లోటు కూడా తగ్గడం వల్ల ప్రపంచంలో తక్కువ డాలర్లు ఉంటాయి.. దీంతో డాలరు విలువ ఇంకా బలోపేతం అవుతుంది. యూఎస్ కి ఎగుమతులు చేయలేక కంపెనీలు అన్నీ.. అమెరికాలోనే ఉత్పత్తులు చేయడానికి మొగ్గుచూపుతాయి.
Read Also: MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోలేదని మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇక, రూపాయి విలువను నిర్దేశిత స్థాయిలో ఉంచడానికి జోక్యం చేసుకోలేమన్నారు. అలాగే, మార్కెట్కు తగినట్లుగా రూపాయి తన సొంత స్థాయిని కనిపెట్టడానికి ఆర్బీఐ యత్నిస్తుంది. ఒక వేళ రూపాయి విషయంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. భారీ ఊగిసలాటకు దారి తీయడంతో పాటు ఎగుమతిదార్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇక, ఇటీవల ఆర్థిక మందగమనంపై ఆందోళన పడొద్దు.. గత కొన్నేళ్లలో బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాం.. స్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు భారీ పెట్టుబడులు, వినియోగ వృద్ధి చాలా అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నారు.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!