Indian Rupee: రూపాయి పతనంపై దయచేసి ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దు..!
- డాలర్ పెరుగుదలతో పతనమైతున్న రూపాయి విలువ..
- రూపాయి పతనంపై ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. ఎగుమతులపై ప్రభావం పడే ఛాన్స్..
- దేశీయంగా వినియోగం పెంచేందుకు మద్దతు ఇచ్చే చర్యలపై దృష్టి పెట్టాలి: రఘురాం రాజన్
Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందుకు బదులుగా మరిన్ని ఉద్యోగాలను సృష్టించి.. దేశీయంగా వినియోగం పెంచేందుకు తగిన మద్దతు ఇచ్చే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది.. అలాగే, ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగానే ఇమిగ్రేషన్, టారిఫ్లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
Read Also: Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
Also Read
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
అలాగే, ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు క్రమంగా బలపడటం.. వివిధ దేశాల ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలే దీనికి ప్రధాన కారణం. టారిఫ్లు పెంచితే, ఇతర దేశాల నుంచి యూఎస్ కి దిగుమతులు తగ్గిపోవడం.. కరెంట్ ఖాతా లోటు, వాణ్యి లోటు కూడా తగ్గడం వల్ల ప్రపంచంలో తక్కువ డాలర్లు ఉంటాయి.. దీంతో డాలరు విలువ ఇంకా బలోపేతం అవుతుంది. యూఎస్ కి ఎగుమతులు చేయలేక కంపెనీలు అన్నీ.. అమెరికాలోనే ఉత్పత్తులు చేయడానికి మొగ్గుచూపుతాయి.
Read Also: MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోలేదని మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇక, రూపాయి విలువను నిర్దేశిత స్థాయిలో ఉంచడానికి జోక్యం చేసుకోలేమన్నారు. అలాగే, మార్కెట్కు తగినట్లుగా రూపాయి తన సొంత స్థాయిని కనిపెట్టడానికి ఆర్బీఐ యత్నిస్తుంది. ఒక వేళ రూపాయి విషయంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. భారీ ఊగిసలాటకు దారి తీయడంతో పాటు ఎగుమతిదార్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇక, ఇటీవల ఆర్థిక మందగమనంపై ఆందోళన పడొద్దు.. గత కొన్నేళ్లలో బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాం.. స్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు భారీ పెట్టుబడులు, వినియోగ వృద్ధి చాలా అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!