Indian Rupee: రూపాయి పతనంపై దయచేసి ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దు..!
- డాలర్ పెరుగుదలతో పతనమైతున్న రూపాయి విలువ..
- రూపాయి పతనంపై ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. ఎగుమతులపై ప్రభావం పడే ఛాన్స్..
- దేశీయంగా వినియోగం పెంచేందుకు మద్దతు ఇచ్చే చర్యలపై దృష్టి పెట్టాలి: రఘురాం రాజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందుకు బదులుగా మరిన్ని ఉద్యోగాలను సృష్టించి.. దేశీయంగా వినియోగం పెంచేందుకు తగిన మద్దతు ఇచ్చే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది.. అలాగే, ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగానే ఇమిగ్రేషన్, టారిఫ్లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
Read Also: Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
Also Read
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
అలాగే, ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు క్రమంగా బలపడటం.. వివిధ దేశాల ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలే దీనికి ప్రధాన కారణం. టారిఫ్లు పెంచితే, ఇతర దేశాల నుంచి యూఎస్ కి దిగుమతులు తగ్గిపోవడం.. కరెంట్ ఖాతా లోటు, వాణ్యి లోటు కూడా తగ్గడం వల్ల ప్రపంచంలో తక్కువ డాలర్లు ఉంటాయి.. దీంతో డాలరు విలువ ఇంకా బలోపేతం అవుతుంది. యూఎస్ కి ఎగుమతులు చేయలేక కంపెనీలు అన్నీ.. అమెరికాలోనే ఉత్పత్తులు చేయడానికి మొగ్గుచూపుతాయి.
Read Also: MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోలేదని మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇక, రూపాయి విలువను నిర్దేశిత స్థాయిలో ఉంచడానికి జోక్యం చేసుకోలేమన్నారు. అలాగే, మార్కెట్కు తగినట్లుగా రూపాయి తన సొంత స్థాయిని కనిపెట్టడానికి ఆర్బీఐ యత్నిస్తుంది. ఒక వేళ రూపాయి విషయంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. భారీ ఊగిసలాటకు దారి తీయడంతో పాటు ఎగుమతిదార్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇక, ఇటీవల ఆర్థిక మందగమనంపై ఆందోళన పడొద్దు.. గత కొన్నేళ్లలో బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాం.. స్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు భారీ పెట్టుబడులు, వినియోగ వృద్ధి చాలా అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నారు.
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!