JioCinema: జియో సినిమాకు ఇక ఛార్జీలు.. ఐపీఎల్ తర్వాత ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioCinema: ఐపీఎల్ హక్కలను సొంతం చేసుకున్న తర్వాత జియో సినిమా చాలా మందికి దగ్గరైంది. అయితే ఇప్పుడు జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను తన జియో సినిమా యాప్ లోకి తీసుకురావాలని అనుకుంటోంది. ఇప్పటికే దేశంలో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలకు జియో సినిమా ద్వారా పోటీ ఇవ్వాలని రిలయన్స్ భావిస్తోంది. అయితే జియో సినిమా కంటెంట్ కు ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ తర్వాత ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధం అవుతోంది.
Read Also: IPL 2023 : పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకుంటుందా..? లక్నో టాప్ ప్లేప్ లోకి వెళ్తుందా..?
Also Read
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
అయితే ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులకు సంబంధించి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది వయాకాప్ 18. జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను ఫ్రీగా అందిస్తోంది. దీంతో జియో సినిమా రీచ్ బాగా పెరిగింది. కొన్ని కోట్ల మంది జియో సినిమా ద్వారా ఐపీఎల్ మ్యచ్ లను వీక్షిస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచులు ఐపోయిన తర్వాత కొత్త కంటెంట్ యాడ్ చేయాలనుకుంటోంది. దీనికి ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ మ్యాచులను మాత్రం ఫ్రీగా అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఐపీఎల్ తో జియో సినిమాకు వచ్చిన ఆదరణను అలాగే కొనసాగించాలని రిలయన్స్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే స్ట్రీమింగ్ దిగ్గజంగా మార్చాలని యోచిస్తోంది.
ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగియనున్నాయి. ఆ లోపే కొత్త కంటెంట్ యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తోంది. ఐపీఎల్ ను మాత్రం యథాతధంగా వీక్షించవచ్చని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎంత మేర ఛార్జీలు వసూలు చేయాలనే దానిపై ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పటికే వ్యూయర్షిప్ లో జియో సినిమా అదరగొడుతోంది. తొలివారంలోనే 5.5 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 12న చెన్నై-రాజస్థాన్ మ్యాచును రికార్డు స్థాయిలో 2.2 కోట్ల మంది చూశారు. ఇదిలా ఉంటే ఇప్పుడైతే ఐపీఎల్ ఫ్రీగా చూస్తున్నాం కానీ, వచ్చే ఏడాది ఫ్రీగా ఇస్తారా..? లేదా.?? అనేది తెలియలేదు. అయితే నెటిజన్లు మాత్రం అలవాటు చేసి ఇప్పుడు ఛార్జంటున్నారని మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!