PM Modi: ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చింది
- ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చింది
- రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోడీ
- బుధవారం ఆల్టైమ్ రికార్డులు సృష్టించిన సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ కొలువుదీరాక స్టాక్ మార్కెట్కు కొత్త ఊపు సంతరించుకుంది. కొద్ది రోజులుగా సూచీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రెండు ప్రధాన సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే అంశంపై బుధవారం రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగంలో ప్రస్తావించారు. ఎన్నికల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్ల రేంజ్ను పెంచాయని తెలిపారు. ప్రపంచంలో కూడా కొత్త ఉత్సాహాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 10వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Koo App Shutdown : మూతపడ్డ దేశీయ సోషల్ మీడియా ‘ కూ ‘ యాప్..
Also Read
- Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోడీ సభలో సమధానమిచ్చారు. దేశంలో ప్రజా రవాణాలో వేగవంతమైన పరివర్తన కనబడుతుందన్నారు. అలాగే మహిళా సాధికారత ప్రయోజనాలు అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నాయని మోడీ చెప్పుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది మహిళలు ‘లఖపతి దీదీలుగా’ మారారన్నారు. రాబోయే సంవత్సరాల్లో వారి సంఖ్య 3 కోట్లకు పెరుగుతుందన్నారు. వ్యవసాయం నుంచి మార్కెట్ వరకు సూక్ష్మ ప్రణాళికతో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసిందని ప్రధాని అన్నారు.
ఇది కూడా చదవండి: Hathras stampede: “భోలే బాబా” సెక్యూరిటీ నెట్టేయడంతోనే తొక్కిసలాట.. కీలక విషయాలు వెలుగులోకి..
ఇక బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ లాభాల్లో పరుగులు పెట్టింది. ఇక సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలిచియాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్లోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి. తొలిసారి సెన్సెక్స్ 80,000 కీలక మైలురాయిని తాకి 80,074 దగ్గర సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే నిఫ్టీ కూడీ 24,296 దగ్గర తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడి 79, 986 దగ్గర ముగియగా.. నిఫ్టీ 162 పాయింట్లు లాభపడి 24, 286 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Supritha: సాంప్రదాయనీ… ‘సుప్పి’నీ.. ఏంటిదీ?
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!