OTP Service: ఆన్లైన్ కస్టమర్లకు ఇక్కట్లు.. ఓటీపీ మెసేజ్ ఆలస్యం! కారణమిదే..!
- ఆన్లైన్ కస్టమర్లకు ఇక్కట్లు
- ఓటీపీ మెసేజ్ ఆలస్యం!
- డిసెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్
ఆన్లైన్ కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త కష్టాలు ఎదురుకాబోతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా.. ఓటీపీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఏ పని జరగదు. అయితే రెండు రోజుల తర్వాత ఓటీపీ ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. దీంతో ఆన్లైన్ సేవలపై ఆధారపడే వాళ్లకు మాత్రం చుక్కలు కనబడనున్నాయి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి నకిలీ ఫోన్ కాల్లు, మెసేజ్లను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా ఇకపై ఓటీపీ మెసేజ్లు కాస్త ఆలస్యంగా రానున్నాయి.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
బ్యాంక్, ఫుడ్ డెలివరీ, పీఎఫ్.. ఇలా ఏ పని చేసుకోవాలన్నా ఓటీపీతోనే పనవుతుంది. ఇది కస్టమర్ల భద్రత కోసం ఇలా జరుగుతోంది. అయితే ఇది కూడా దుర్వినియోగం అవుతున్నట్లుగా ట్రాయ్ గుర్తించింది. పలువురు నుంచి భారీగా నగదు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఫోన్ కాల్లు, సందేశాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా డిసెంబర్ 1 నుంచి మెసేజ్లు ఆలస్యంగా రానున్నాయి. ఒక వేళ ఓటీపీ రాకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీంతో ఆన్లైన్ కస్టమర్లు ఇబ్బందులు పడకతప్పదు.
ఇది కూడా చదవండి: TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..
ఆయా కంపెనీలు నవంబర్ 30లోగా ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ట్రాయ్ నిబంధనలకు కంపెనీలు ఓకే చెప్పాలి. లేకుంటే డిసెంబర్ 1 నుంచి ఓటీపీలు ఆగిపోతే… దీంతో డెలివరీ సంస్థలు గానీ.. బ్యాంకులు గానీ.. మొబైల్ సంస్థలు గానీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ తిప్పలన్నీ కస్టమర్లు పడాల్సి వస్తుంది. ఓటీపీ ఆలస్యం కాకుండా ఉండాలంటే ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇదంతా కస్టమర్ల భద్రత కోసమేనని ట్రాయ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!