Online Shopping: ఫెస్టివల్ సేల్స్లో “జాగ్రత్త”? ఆన్లైన్ ముసుగులో సైబర్ నేరాలు
- ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు
- ఆన్లైన్ విక్రయాల ముసుగులో సైబర్ దుండగులు
- కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్లిప్కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆన్ లైన్ విక్రయాల ముసుగులో సైబర్ దుండగులు కూడా యాక్టివ్ అయ్యారు. వివిధ పద్ధతులను ప్రయత్నించడం ద్వారా వారు మీ జేబును ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల నుంచి కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.
అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు..
ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయండి. మీ ఫోన్లో తెలియని నంబర్ల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దు. వెబ్సైట్ను తెరవడానికి ముందు, వెబ్సైట్ పేరు ముందు https అని వ్రాయబడిందో లేదో తనిఖీ చేయండి. మీరు యాప్ ద్వారా షాపింగ్ చేస్తుంటే, యాప్ను డౌన్లోడ్ చేసే ముందు దాని రేటింగ్, కామెంట్స్ చదవండి. తక్కువ రేటింగ్ ఉన్న యాప్లను డౌన్లోడ్ చేయవద్దు.
Also Read
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
సోషల్ మీడియాలో జాగ్రత్త..
ఈ రోజుల్లో, చాలా మంది విక్రేతలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి సోషల్ మీడియా సహాయం కూడా తీసుకుంటున్నారు. వాటిలో ప్రముఖమైనవి ఇన్స్టాగ్రామ్ (Instagram), వాట్సప్ (WhatsApp), ఫేస్బుక్ (Facebook). మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియని విక్రేత నుంచి ఏదైనా కొనుగోలు చేస్తుంటే.. ఆన్లైన్ చెల్లింపు అస్సలు చేయొద్దు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటేనే చేయండి. డబ్బులు తీసుకున్న తర్వాత అమ్మకందారులు అదృశ్యమైన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి.
ఊహించని పార్శిల్స్ పట్ల అప్రమత్తం..
చాలా సార్లు ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి మన పేరుపై డెలివరీ వచ్చిందని చెప్పి డబ్బు అడుగుతాడు. తాను ఏ వస్తువును ఆర్డర్ చేయలేదని ఆ వ్యక్తి చెప్పడంతో, ఆ వ్యక్తిని తన సీనియర్ పేరుతో గ్యాంగ్లోని మరో వ్యక్తితో మాట్లాడేలా చేస్తాడు. అతను పార్శిల్ను రద్దు చేయమని అడగడంతో ఓటీపీ వస్తుంది చెప్పమని అంటాడు. మీరు ఓటీపీ ఇస్తే.. ఖాతా ఖాళీ కావడానికి ఎక్కువ సమయం పట్టదు. అటువంటి పరిస్థితిలో .. ఎటువంటి ఓటీపీ ఇవ్వవద్దు. డెలివరీ బాయ్ అనుమానుస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు కాల్ చేయండి..
రివార్డ్ పాయింట్ల బారిన పడకుండా ఉండండి
సైబర్ మోసగాళ్లకు కస్టమర్ డేటాను అందించడంలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటున్నట్లు ఇలాంటి అనేక నివేదికలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఈ మోసగాళ్ళు మీ కార్డ్ డేటాను పొందినట్లయితే వారు రివార్డ్ పాయింట్ల ద్వారా లేదా మరే ఇతర మార్గంలో మోసం చేయవచ్చు. ఈ మోసగాళ్లు రివార్డు పాయింట్ల గడువు ముగిసిందని చెప్పి అవసరమైన సమాచారాన్ని తీసుకుని డబ్బును వృథా చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, కార్డుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దు.
ఫేక్ ఆఫర్ల బారిన పడకండి..
ఒక ఉత్పత్తిపై మీకు భారీ ఆఫర్ (90 శాతం లేదా అంతకంటే ఎక్కువ) ఇస్తున్నట్లు మీ ఫోన్లో సందేశం వస్తే, అప్రమత్తంగా ఉండండి. ఇది సైబర్ దుండగుల ఆట కావచ్చు. మెసేజ్లో ఇచ్చిన లింక్పై పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు లేదా ట్యాప్ చేయవద్దు. ఇలా చేయడం ద్వారా, సైబర్ దుండగులు మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును దొంగిలించవచ్చు.
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..
-
Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
-
NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!