Bhavish Agarwal: ఇక నుంచి గ్రామాల్లోనూ ఓలా ఇ-స్కూటర్.. సీఈవో భారీ ప్లాన్
- ఇక నుంచి గ్రామాల్లోనూ ఓలా ఇ-స్కూటర్
- దాని కోసం ఓల కొత్త ప్లాన్
- నెట్వర్క్ పార్టనర్స్ ప్రోగ్రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఈ-వాహనాలు, ముఖ్యంగా ఈ-స్కూటర్ల పోరు మార్కెట్లో చాలా తీవ్రంగా మారింది. చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. పండుగల సీజన్లో విక్రయాలు పెంచుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే దేశంలోని అతిపెద్ద ప్యూర్-ప్లే ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన నెట్వర్క్ భాగస్వాముల సంఖ్యను పెంచుకోవాలని కొత్త ప్లాన్ వేసింది. కంపెనీ తమ విక్రయదారులను డీలర్లుగా కాకుండా నెట్వర్క్ భాగస్వాములుగా పిలుస్తుండటం గమనార్హం.
నెట్వర్క్ పార్టనర్స్ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం ఏమిటి?
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
కంపెనీ ప్రకారం.. నెట్వర్క్ పార్టనర్స్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఈవీ విప్లవాన్ని టైర్ 2 మరియు టైర్ 3 నగరాలకు విస్తరించడం. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఈవీల ప్రవేశం తగ్గింది. ఈ కార్యక్రమం కింద, కంపెనీ భారతదేశంలో తన విక్రయాల పాదముద్రను పెంచుకోవడానికి 625 మంది భాగస్వాములను చేర్చుకుంది. ఈ ఏడాది పండుగలకు ముందే భాగస్వామ్యుల సంఖ్యను 1000కు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా.. 2025 చివరి నాటికి కంపెనీ తన సేల్స్, సర్వీస్ నెట్వర్క్కు 10,000 మంది భాగస్వాములను చేర్చుకోవాలని యోచిస్తోంది.
ప్రస్తుతం విక్రేతల సంఖ్య?
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం కంపెనీ యాజమాన్యంలో దాదాపు 800 స్టోర్లను కలిగి ఉంది. కంపెనీ నడుపుతున్న ‘నెట్వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్’తో.. అమ్మకాలు మరియు సర్వీస్ టచ్ పాయింట్ల సంఖ్య దాదాపు 1800 వరకు పెరుగుతుంది. గత సెప్టెంబర్లో కంపెనీకి చెందిన స్కూటర్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. సెప్టెంబర్లో ఓలా 23,695 స్కూటర్లను మాత్రమే విక్రయించింది. ఇంతకుముందు ఈ-స్కూటర్ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇప్పుడు దాదాపు 27 శాతానికి తగ్గింది.
గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకే ఈ పద్ధతి..
గ్రామీణ మార్కెట్కు చేరుకోవడానికి స్థిరమైన వ్యాపార వృద్ధిని తీసుకురావడంలో తమ డి2సి మోడల్ చాలా విజయవంతమైందని ఓలా ఎలక్ట్రిక్ సీఎండీ భవిష్ అగర్వాల్ చెప్పారు. ఇప్పుడు నెట్వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్ వారి డి2సి నెట్వర్క్ ప్రయోజనాలను మరింత వేగంగా విస్తరిస్తుందని భవిష్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇందులో భాగస్వాములు తక్కువ పెట్టుబడితో చాలా వేగంగా వృద్ధి చెందుతారని తెలిపారు. కంపెనీ యాజమాన్యంలోని స్టోర్లు కంపెనీ విక్రయాలు మరియు సేవా నెట్వర్క్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, దేశంలోని పట్టణ, గ్రామీణ మార్కెట్లకు విస్తరించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!