Silver Prices: తెల్లబంగారమా? వెండి గండమా? మూడు రోజుల్లో రూ.48 వేలు పెరిగిన వెండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Prices: బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఈ విలువైన లోహాలు ప్రతిరోజూ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఈ వారం కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లోనే వెండి ధరలు రూ.48 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బంగారం ధరలు ఈ మూడు రోజుల్లో రూ.6 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బుధవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.
READ ALSO: Keerthi Bhatt : రాజీ పడలేను.. ఒంటరిగానే పోరాడతా: నిశ్చితార్థం రద్దు చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
వెండి ధరలలో ఈ పెరుగుదల గత సంవత్సరం ప్రపంచ వెండి ధరలలో జరిగిన ఆశ్చర్యకరమైన పెరుగుదలకు అద్దం పడుతుంది. 2025 జనవరిలో ఔన్సుకు దాదాపు $30 నుంచి జనవరి 2026లో ఔన్సుకు దాదాపు $111కి పెరిగాయి. వెండి 12 నెలల్లో దాదాపు 270% పెరుగుదల నమోదు చేసింది. 2026లో కూడా ఈ ఊపు కొనసాగిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనవరిలో ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు 20% పెరిగాయి. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత స్వర్గధామాలకు పారిపోవడం దీనికి మరొక కారణంగా చెబుతున్నారు.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే..
వెండికి డిమాండ్ పెరగడం వల్ల వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే AI, సెమీకండక్టర్లు, సౌరశక్తి, బ్యాటరీలు, ప్రతిదానికీ వెండి అవసరం పెరగడం ఈ ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. FPA ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకుడు, ట్రూవాంటా వెల్త్ వ్యవస్థాపకుడు కీర్తన్ షా మాట్లాడుతూ.. వెండి ర్యాలీని వెంబడించడం వల్ల కలిగే నష్టాల గురించి పెట్టుబడిదారులను హెచ్చరించారు. వెండి ధరలు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పారు. అందులో మొదటిది బ్యాటరీలు, సాంకేతికత తయారీలో ఉన్న కంపెనీల నుంచి వెండికి ఉన్న నిజమైన పారిశ్రామిక డిమాండ్ అని, రెండవది పెట్టుబడి డిమాండ్ అని వెల్లడించారు.
పెట్టుబడిదారులు ETFల ద్వారా వెండిని కొనుగోలు చేసినప్పుడు, నిధులు సాధారణంగా బ్యాకెండ్లో భౌతిక వెండిని కొనుగోలు చేస్తాయి. అంటే వెండి ETFలలో పెరిగిన పెట్టుబడి వెండికి డిమాండ్ను కూడా పెంచుతుంది. గత 90 రోజుల్లోనే వెండి ETFలకు డిమాండ్ రెట్టింపు అయిందన్నారు. వెండి ర్యాలీ ఉన్నప్పటికీ ధర తగ్గుదల ప్రమాదాల గురించి పెట్టుబడిదారులను ఆయన హెచ్చరించారు. వెండి ధర పడిపోయినప్పుడు దాని విలువలో 80-90 శాతం కోల్పోయే చరిత్ర ఉందని గుర్తు చేశారు. చరిత్రలో ఇప్పటికే ఇలా రెండుసార్లు జరిగిందని చెప్పారు. వెండి పెట్టుబడిలో తన అభిప్రాయాన్ని చెబుతూ.. “నేను నా వెండి స్టాక్ను కొనసాగిస్తాను, కానీ నేటి ధరలకు కొత్త వెండిని కొనుగోలు చేయను” అని అన్నారు. నిజానికి వెండికి పారిశ్రామిక డిమాండ్ ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుత ధరల వృద్ధి ఎక్కువగా పెట్టుబడుల ద్వారానే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది వాస్తవ పారిశ్రామిక డిమాండ్ కంటే చాలా పెద్ద బుడగ అని, వెండిని పెట్టుబడి సాధనంగా ఉపయోగించేటప్పుడు పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
READ ALSO: Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!