Silver Prices: తెల్లబంగారమా? వెండి గండమా? మూడు రోజుల్లో రూ.48 వేలు పెరిగిన వెండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Prices: బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఈ విలువైన లోహాలు ప్రతిరోజూ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఈ వారం కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లోనే వెండి ధరలు రూ.48 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బంగారం ధరలు ఈ మూడు రోజుల్లో రూ.6 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బుధవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.
READ ALSO: Keerthi Bhatt : రాజీ పడలేను.. ఒంటరిగానే పోరాడతా: నిశ్చితార్థం రద్దు చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!
Also Read
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
- Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
వెండి ధరలలో ఈ పెరుగుదల గత సంవత్సరం ప్రపంచ వెండి ధరలలో జరిగిన ఆశ్చర్యకరమైన పెరుగుదలకు అద్దం పడుతుంది. 2025 జనవరిలో ఔన్సుకు దాదాపు $30 నుంచి జనవరి 2026లో ఔన్సుకు దాదాపు $111కి పెరిగాయి. వెండి 12 నెలల్లో దాదాపు 270% పెరుగుదల నమోదు చేసింది. 2026లో కూడా ఈ ఊపు కొనసాగిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనవరిలో ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు 20% పెరిగాయి. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత స్వర్గధామాలకు పారిపోవడం దీనికి మరొక కారణంగా చెబుతున్నారు.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే..
వెండికి డిమాండ్ పెరగడం వల్ల వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే AI, సెమీకండక్టర్లు, సౌరశక్తి, బ్యాటరీలు, ప్రతిదానికీ వెండి అవసరం పెరగడం ఈ ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. FPA ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకుడు, ట్రూవాంటా వెల్త్ వ్యవస్థాపకుడు కీర్తన్ షా మాట్లాడుతూ.. వెండి ర్యాలీని వెంబడించడం వల్ల కలిగే నష్టాల గురించి పెట్టుబడిదారులను హెచ్చరించారు. వెండి ధరలు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పారు. అందులో మొదటిది బ్యాటరీలు, సాంకేతికత తయారీలో ఉన్న కంపెనీల నుంచి వెండికి ఉన్న నిజమైన పారిశ్రామిక డిమాండ్ అని, రెండవది పెట్టుబడి డిమాండ్ అని వెల్లడించారు.
పెట్టుబడిదారులు ETFల ద్వారా వెండిని కొనుగోలు చేసినప్పుడు, నిధులు సాధారణంగా బ్యాకెండ్లో భౌతిక వెండిని కొనుగోలు చేస్తాయి. అంటే వెండి ETFలలో పెరిగిన పెట్టుబడి వెండికి డిమాండ్ను కూడా పెంచుతుంది. గత 90 రోజుల్లోనే వెండి ETFలకు డిమాండ్ రెట్టింపు అయిందన్నారు. వెండి ర్యాలీ ఉన్నప్పటికీ ధర తగ్గుదల ప్రమాదాల గురించి పెట్టుబడిదారులను ఆయన హెచ్చరించారు. వెండి ధర పడిపోయినప్పుడు దాని విలువలో 80-90 శాతం కోల్పోయే చరిత్ర ఉందని గుర్తు చేశారు. చరిత్రలో ఇప్పటికే ఇలా రెండుసార్లు జరిగిందని చెప్పారు. వెండి పెట్టుబడిలో తన అభిప్రాయాన్ని చెబుతూ.. “నేను నా వెండి స్టాక్ను కొనసాగిస్తాను, కానీ నేటి ధరలకు కొత్త వెండిని కొనుగోలు చేయను” అని అన్నారు. నిజానికి వెండికి పారిశ్రామిక డిమాండ్ ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుత ధరల వృద్ధి ఎక్కువగా పెట్టుబడుల ద్వారానే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది వాస్తవ పారిశ్రామిక డిమాండ్ కంటే చాలా పెద్ద బుడగ అని, వెండిని పెట్టుబడి సాధనంగా ఉపయోగించేటప్పుడు పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
READ ALSO: Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
తాజావార్తలు
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?
-
Thalapathy Vijay: విజయ్ ‘పట్టాభిషేకానికి’ ఊపిరి పోస్తున్న 32 ఏళ్ల నాటి ‘బొమ్మై’ తీర్పు! తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్..
-
Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
-
Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?
-
Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే