మహిళలకు ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుంది.. అందులో ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని అందిస్తుంది. ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు..ఎల్ఐసీ ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంది…ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకం. కేవలం మహిళలు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలకు సేవింగ్స్తో పాటు రక్షణ కూడా అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. ఈ పాలసీకి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పాలసీ తీసుకోవాలంటే 8 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే కనీసం రూ.2,00,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి చెల్లించవచ్చు.. ఇది స్కీమ్ లో ఆడపిల్లలు కూడా చేరవచ్చు..
ఇకపోతే 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.3,00,000 సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.30 చొప్పున ఏటా రూ.10,959 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.3,97,000 రిటర్న్స్ వస్తాయి. చెల్లించిన ప్రీమియంతో పాటు బోనస్ కూడా వస్తుంది..అదే 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.2,00,000 సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.22 చొప్పున ఏటా రూ.7,860 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.2,33,000 రిటర్న్స్ వస్తాయి..
ఈ పాలసీ తీసుకున్న తర్వాత మహిళ ఏదైనా కారణం చేత చనిపోతే నామినీకి డబ్బులు చెల్లిస్తుంది ఎల్ఐసీ. పాలసీ తీసుకున్న ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత మరణిస్తే లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న తర్వాత రెండేళ్లు పూర్తి ప్రీమియంలు చెల్లిస్తే లోన్ సదుపాయం కూడా ఉంటుంది.. అలాగే పన్ను మినహాయింపు కూడా ఉంది..