Ministry of Consumer Affairs: రూపాయికే ఐఫోన్! .. ప్రభుత్వం సీరియస్
- త్వరలో పండుగల సీజన్
- ప్రారంభించిన ఈ-కామర్స్ కంపెనీలు
- నకిలీ ప్రకటనలతో మోసం
- చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్ను ప్రకటించిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. అనేక ఆకర్షణీయమైన ఆఫర్ల ప్రకటనలు కూడా ఈ విక్రయాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఒక్క రూపాయికే ఐఫోన్ ఇస్తానని, మరి కొన్ని చోట్ల తక్కువ ధరకే ఇతర ఖరీదైన వస్తువులపై ఆఫర్ను అందిస్తున్నారు.
READ MORE: Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
Also Read
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ఇలాంటి ప్రకటనలను చూసి, వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ-కామర్స్ వెబ్సైట్లకు లాగిన్ చేస్తారు. అదే సమయంలో.. చాలా మంది వినియోగదారులు ఇలాంటి ప్రకటనలను తప్పుదారి పట్టించేలా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ-కామర్స్పై వస్తున్న ప్రకటనలపై ప్రభుత్వం కూడా ఓ కన్నేసి ఉంచింది.
READ MORE:Assistance to Flood Victims: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. వివరాలు ఇవే..
ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే స్పందిస్తూ.. “మాకు అలాంటి ఫిర్యాదులు అందాయి. ఇ-కామర్స్ కంపెనీలు నమ్మశక్యం కాని వాదనలు చేస్తున్నాయి. కస్టమర్లు ఆర్డర్ చేసినప్పుడు.. డెలివరీ ఛార్జీలు కూడా తప్పుగా జోస్తున్నారు. డిస్కౌంట్ అకస్మాత్తుగా ముగిసిందని వినియోగదారులకు చెబుతున్నారు. ఈ ఫిర్యాదులపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. కస్టమర్లు ఇలా ఫిర్యాదు చేయవచ్చు.” అని పేర్కొన్నారు. ఈ-కామర్స్ సైట్లలో కస్టమర్లు ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను చూసినట్లయితే.. వారు తమ ఫిర్యాదును కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ యొక్క ఫిర్యాదు పోర్టల్లో నమోదు చేయవచ్చని మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి తెలిపారు. ప్రస్తుతం చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు.
READ MORE: Dana Kishore: మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దు..
రూ.1కే ఐఫోన్
ఇ-కామర్స్ వెబ్సైట్ ఐఫోన్ను రూ. 1కి విక్రయిస్తానని ఎలా హామీ ఇస్తోందని సోషల్ మీడియాలో కొందరు ఫిర్యాదు చేశారు. అయితే వారు బుక్ చేసుకునే సమయానికి, ఉత్పత్తి అమ్ముడైందని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!