Tractor High Sales : చరిత్రలో తొలిసారి.. 10 లక్షల మార్కును దాటిన భారత ట్రాక్టర్ అమ్మకాలు!
- చరిత్రలో తొలిసారి ట్రాక్టర్ అమ్మకాలు 10 లక్షల మార్క్ దాటింది
- జీఎస్టీ తగ్గింపు, మంచి వర్షాలు అమ్మకాలకు ఊపునిచ్చాయి
- మహీంద్రా అగ్రస్థానంలో.. మార్కెట్ వాటా 24%
- వ్యవసాయ యాంత్రీకరణతో గ్రామీణ ఉపాధికి ప్రోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ , వ్యవసాయ రంగం వేగంగా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పడానికి 2025 సంవత్సరం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ఒకే ఏడాదిలో దేశీయ ట్రాక్టర్ అమ్మకాలు పది లక్షల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించాయి. ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ (TMA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో ఏకంగా 10.9 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ ట్రాక్టర్లకు ఆదరణ పెరగడంతో ఎగుమతులు కూడా లక్ష మార్కును దాటి రికార్డు సృష్టించాయి.
The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన!
Also Read
- Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- Campa Cola vs Coca-Cola: 'కోలా వార్'లో కొత్త మలుపు.. అంబానీ 'క్యాంపా' దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ రికార్డు స్థాయి విక్రయాల వెనుక ప్రభుత్వ నిర్ణయాలు , ప్రకృతి అనుకూలత ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్లపై ఉన్న జీఎస్టీని అక్టోబర్ నెలలో 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం ఈ పరిశ్రమకు పెద్ద ఊతాన్ని ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ట్రాక్టర్ల ధరలు హార్స్ పవర్ ఆధారంగా 40 వేల నుంచి లక్ష రూపాయల వరకు తగ్గడంతో రైతులు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపారు. దీనికి తోడు 2025లో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 108 శాతం ఎక్కువగా నమోదు కావడంతో సాగు విస్తీర్ణం పెరిగి, రైతుల వద్ద నగదు లభ్యత మెరుగుపడింది. సాగు పనులకే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన , రవాణా రంగంలోనూ ట్రాక్టర్ల వినియోగం పెరగడం అమ్మకాలకు కలిసొచ్చింది.
కంపెనీల పరంగా చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా 24 శాతం మార్కెట్ వాటాతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ సంస్థ సుమారు 2.37 లక్షల యూనిట్లను విక్రయించగా, స్వరాజ్ , సోనాలికా సంస్థలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2024లో 9.1 లక్షలుగా ఉన్న అమ్మకాలు, కేవలం ఏడాది కాలంలోనే 10.9 లక్షలకు చేరడం చూస్తుంటే భారత రైతులకు యంత్రాలపై పెరుగుతున్న అవగాహన , గ్రామీణ ఉపాధి వనరుల బలోపేతం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను మరింత పెంచడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని మరిన్ని కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
MLA Malla Reddy : సంక్రాంతి సంబరాల్లో ముగ్గు వేసిన మల్లారెడ్డి..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!