Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త
- పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ప్రవహించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రకాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించేందుకు కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే ఈ సడలింపుల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఇటీవల రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే సుమారు 6 శాతం బలహీనపడటం.. జనవరి నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకోవడం నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఆందోళన
ఈ ఏడాది ప్రారంభం నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ కూడా కొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ప్రభుత్వ బాండ్లపై పన్ను మినహాయింపు?
ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లో (G-Secs) పెట్టే పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులను పూర్తిగా మినహాయించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ద్వారా పొందే వడ్డీ ఆదాయంపై 20 శాతం విత్హోల్డింగ్ ట్యాక్స్ (TDS), అలాగే 12.5 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అమల్లో ఉన్నాయి. 2023 జూలై 1 వరకు ఈ విత్హోల్డింగ్ ట్యాక్స్ రేటు కేవలం 5 శాతంగా ఉండేది.
విదేశీ పెట్టుబడిదారుల డిమాండ్లు
కేంద్ర బడ్జెట్కు ముందు విదేశీ పెట్టుబడిదారుల ప్రతినిధులు భారత మార్కెట్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా లిస్టెడ్ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని.. ఒకేసారి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్తో పాటు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) విధించడం పెట్టుబడిదారులకు భారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.
యుద్ధ ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాల మధ్య విదేశీ పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారింది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?