Recharge Price Hike: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కస్టమర్లకు షాక్.. 20 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు..?
- జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కస్టమర్లకు షాక్..
- ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ టారిఫ్లను 20 శాతం పెంచే అవకాశం..
- రెండేళ్ల విరామం తర్వాత భారీగా మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Recharge Price Hike: టెలికాం ఆపరేటర్స్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆయా కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. కాగా, 2026 నాటి పెంపుతో ఒక కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెంచేలా కంపెనీలు టార్గెట్ గా పెట్టుకున్నాయి.
Read Also: Gold Rates: మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన సిల్వర్, గోల్డ్ ధరలు
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
టారిఫ్లు పెంచడానికి ప్రధాన కారణం..
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఈ పెట్టుబడులపై రాబడి (ROI) కోసం ధరల పెంపు ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం కనీసం 300 రూపాయలు దాటాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 – రూ.210 మధ్య ఉంది. కేంద్ర ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర లోన్స్ ను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరమైంది.
Read Also: Shambhala : సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్
సామాన్యులపై తీవ్ర భారం..
నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకి ఈ మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు మరింత భారంగా మారనుంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉండే అవకాశం ఉంది. 20 శాతం పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీ మొత్తంలో పెరగనుంది. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపించనుంది. డేటా ఖరీదుగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం కూడా ఉందనే చర్చ కొనసాగుతుంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులకు రీఛార్జ్ చేయడం ఆపేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?