Recharge Price Hike: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కస్టమర్లకు షాక్.. 20 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు..?
- జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కస్టమర్లకు షాక్..
- ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ టారిఫ్లను 20 శాతం పెంచే అవకాశం..
- రెండేళ్ల విరామం తర్వాత భారీగా మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Recharge Price Hike: టెలికాం ఆపరేటర్స్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆయా కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. కాగా, 2026 నాటి పెంపుతో ఒక కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెంచేలా కంపెనీలు టార్గెట్ గా పెట్టుకున్నాయి.
Read Also: Gold Rates: మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన సిల్వర్, గోల్డ్ ధరలు
Also Read
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
టారిఫ్లు పెంచడానికి ప్రధాన కారణం..
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఈ పెట్టుబడులపై రాబడి (ROI) కోసం ధరల పెంపు ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం కనీసం 300 రూపాయలు దాటాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 – రూ.210 మధ్య ఉంది. కేంద్ర ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర లోన్స్ ను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరమైంది.
Read Also: Shambhala : సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్
సామాన్యులపై తీవ్ర భారం..
నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకి ఈ మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు మరింత భారంగా మారనుంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉండే అవకాశం ఉంది. 20 శాతం పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీ మొత్తంలో పెరగనుంది. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపించనుంది. డేటా ఖరీదుగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం కూడా ఉందనే చర్చ కొనసాగుతుంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులకు రీఛార్జ్ చేయడం ఆపేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..