Gold Rates: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు..
బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. జూలై 8న బంగారం ధర నేలచూపులు చూసింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 మేర తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 51,110కు దిగి వచ్చింది. మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.750, 24 క్యారెట్లపై రూ.820 మేర తగ్గింది. దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి.. రూ.57,000 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం.
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,110 వద్ద ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,970 వద్ద ఉంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 ఉంది.
వెండి ధరలు ఇలా..: హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.62,400, విజయవాడలో రూ.62,400, విశాఖపట్నంలో రూ.62,400 లుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.57,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.57,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.62,400 ఉంది. బెంగళూరులో రూ.62,400, కేరళలో రూ.62,400లుగా కొనసాగుతోంది.
Also Read
- Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
పసిడి రేటుపై అంతర్జాతీయ మార్కెట్లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. అందువల్ల మన దగ్గర బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు తగ్గాయి. అందువల్ల ఇప్పుడు కొనొచ్చా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పసిడి రేటు పడిపోవడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు గోల్డ్ జువెలరీ కొనుగోలు చేయొచ్చు. బంగారం ధర ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 56 వేలకు పైనే ఉంది. అందువల్ల అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు గోల్డ్ రేటు భారీగానే తగ్గిందని చెప్పుకోవాలి.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో