DefExpo-2022: ఇలాంటి డిఫెన్స్ ఎక్స్పో.. గతంలో ఎప్పుడూ జరగలేదు పో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DefExpo-2022: గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహిస్తున్న డిఫెన్స్ ఎక్స్పో 12వ ఎడిషన్లో ఇప్పటికే లక్షన్నర కోట్లకు పైగా విలువైన 451 అవగాహన ఒప్పందాలు(ఎంఓయూలు), ఒడంబడికలు కుదిరాయని అధికారులు తెలిపారు. దీంతో బిజినెస్ జనరేషన్కి సంబంధించిన పాత రికార్డులన్నీ బద్ధలైనట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్లో డిఫెన్స్ ఎక్స్పో జరగలేదని, ఈసారి అత్యధిక సంఖ్యలో ఎగ్జిబిటర్లు, వేల సంఖ్యలో బిజినెస్ విజిటర్స్ హాజరవుతున్నారని డిఫెన్స్ సెక్రెటరీ అజయ్ కుమార్ వెల్లడించారు.
18వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన రేపటి వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ హాజరయ్యారు. ఇప్పటివరకు ఇదే ‘‘ది బెస్ట్’’, మోస్ట్ ఔట్స్టాండింగ్ డిఫెన్స్ ఎక్స్పో అని, మన దేశ రక్షణ రంగ సాధికారతలో సరికొత్త యుగానికి నాంది పలికిందని రక్షణ శాఖ మంత్రి రాజ్సాథ్ సింగ్ అన్నారు. ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ స్వావలంబనలో ఇది ఆరంభమని, భవిష్యత్.. భారతదేశానిదే అనే సందేశాన్ని ఈ ప్రదర్శన చాటిందని తెలిపారు.
Also Read
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
గ్లోబల్ డిఫెన్స్ మ్యానిఫ్యాక్షరింగ్ హబ్గా ఇండియా ఎదగబోతోందనే వాస్తవాన్ని సైతం ఈ కార్యక్రమం కళ్లకు కట్టినట్లు రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందట(2020లో) ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పోలో 201 ఎంఓయూలు మాత్రమే కుదిరినట్లు అధికారులు గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎక్స్పోలో ఎంఓయూలు, ఒడంబడికలు పరిశ్రమ-పరిశ్రమ, పరిశ్రమ-రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ-కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!