Credit Card New Rules :హెచ్డీఎఫ్సీ కార్డ్ హోల్డర్ బ్యాడ్ న్యూస్..ఆగస్టు నుంచి అదనపు ఛార్జీలు
- ఆగస్టు నుంచి కొత్త నియమాలు
- హెచ్డీఎఫ్సీ కార్డ్ హోల్డర్కు అదనపు ఛార్జీల బాదుడు
- అద్దె చెల్లింపుపై అదనపు ఛార్జీ
- పెట్రోల్..డీజిల్పై మినహాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై మాసం ముగిసి ఆగస్టు ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు, ఆగస్టు 1, 2024 నుంచి అనేక ఆర్థిక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. మీరు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే. ఆగస్టు నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన నియమాలు మారబోతున్నాయి. ఇది మీ ఖర్చులను పెంచుతుంది.
READ MORE:Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
అద్దె చెల్లింపుపై అదనపు ఛార్జీ..
ఆగస్టు 1, 2024 నుంచి దేశంలో అమలు చేయాల్సిన ప్రధాన మార్పులలో ఒకటి ఫైనాన్స్కు సంబంధించినది. ఇది హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించే కార్డ్ హోల్డర్లపై ప్రభావం చూపుతుంది. థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ల ద్వారా చేసే అన్ని అద్దె లావాదేవీలపై బ్యాంక్ ఇప్పుడు తన క్రెడిట్ కార్డ్ వినియోగదారుల నుంచి 1 శాతం అదనపు ఛార్జీని వసూలు చేస్తుంది. PayTM, CRED, MobiKwik మరియు ఇతర థర్డ్-పార్టీ యాప్లను ఉపయోగించి హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే ఈ నియమం వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి గరిష్ట పరిమితిని రూ. 3,000గా బ్యాంక్ సెట్ చేసింది.
READ MORE:Fire Accident in Hospital: అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రిలో రాజుకున్న అగ్గి.. తృటితో తప్పిన ఘోర ప్రమాదం
యుటిలిటీ లావాదేవీలకు ఇంత ఎక్కువ ఛార్జీ:
యుటిలిటీ లావాదేవీలకు కూడా అదనపు ఛార్జీలు విధించబడుతున్నాయి. అయితే.. రూ. 50,000 లోపు లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. చెల్లింపు విలువ రూ. 50,000 దాటితే, 1 శాతం ఛార్జ్ విధించబడుతుంది. ఇక్కడ కూడా ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 3,000గా నిర్ణయించబడింది.
READ MORE: Hyderabad Crime: కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు.. ఆకలి తట్టుకోలేక తల్లి మృతి..
పెట్రోల్ మరియు డీజిల్పై మినహాయింపు..
ఇంధన లావాదేవీలకు సంబంధించి అమలు చేయబోయే కొత్త నియమం ప్రకారం.. కార్డుదారుడు రూ. 15,000 కంటే తక్కువ చమురు చెల్లింపు చేస్తే, అప్పుడు ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. అయితే దీని కంటే ఎక్కువ లావాదేవీలకు 1 శాతం ఛార్జ్ చెల్లించాలి. బీమా చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..