హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేశారు భక్తులు.. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.. మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినా పూజ చేసిన దీపం వెలిగించడం మన ఆచారం. అదేవిధంగా దీపాలలో చాలా రకాలు ఉంటాయి.. శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.. ఎలా చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.. ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫొటోను ఉంచి సాక్షాత్తు ఆ శ్రీహరిగా భావించాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివారి పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటిముందు మంచి ముగ్గు పెట్టాలి.. ఇలా చెయ్యడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..
స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి,పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.. స్వామికి ప్రత్యేకమైన పుస్తకాలను వాయానంగా ఇవ్వొచ్చు.. ఇక పూజ చేసేటప్పుడు ”ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి.. ఇలా ఏడు శనివారాలు పూజలు చేస్తే స్వామివారి అనుగ్రహం ఉంటుంది.. ఇంట్లో సిరి సంపదలు వెల్లు విరుస్తాయి..