Mauni Amavasya 2026: నేడు మౌనీ అమావాస్య.. ఈ నియమాలు పాటిస్తే పుణ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mauni Amavasya 2026: నేడు (జనవరి 18, 2026) మౌనీ అమావాస్య. హిందూ ధర్మంలో ఈ రోజు చాలా పవిత్రమైనది. నేడు చేసే ప్రతి మంచి పని సాధారణ రోజులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర భావంతో రోజును ప్రారంభిస్తారు. మౌనీ అమావాస్య రోజు ముఖ్యంగా స్నానం, దానం, పితృ తర్పణం, విష్ణు భగవానుడి పూజలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెల్లవారుజామున నదిలో స్నానం చేసే అవకాశం ఉన్నవారు మూడు సార్లు మునిగి, సూర్యుడి వైపు చూసి చేతిలో నీరు తీసుకుని అర్ఘ్యం ఇస్తారు. ఆ సమయంలో మన ఇష్టదైవాన్ని, మన పూర్వీకులను మనసులో తలుచుకుంటే మంచిదని నమ్మకం. నదికి వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేసి, ఆ నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుంటారు. స్నానం తర్వాత తాంబరపాత్రలో నీరు, నువ్వులు, పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు. ఈ రోజు కొంతసేపైనా మౌనం పాటిస్తే మంచి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
READ MORE: Off The Record: అక్కడ వైసీపీలో గ్రూపుల గోల.. మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో కోల్డ్ వార్..!
Also Read
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
స్నానం తర్వాత ఇంట్లో దీపం వెలిగించి వ్రత సంకల్పం చేసుకుంటారు. విష్ణు భగవానుడిని మనస్ఫూర్తిగా పూజిస్తారు. రోజంతా అనవసర మాటలు తగ్గించి, దేవుడి ధ్యానంలో గడపడానికి ప్రయత్నిస్తారు. పగలు నిద్రపోకుండా జాగ్రత్త పడతారు. సాయంత్రం మళ్లీ దీపం వెలిగించి విష్ణు భగవానుడిని, గంగామాతను, పితరులను స్మరిస్తారు. వీలైనంత మేరకు అన్నదానం, వస్త్రదానం, నిత్యావసర వస్తువుల దానం చేస్తారు. ఈ మౌనీ అమావాస్యకు సంబంధించిన ఒక అందమైన కథ కూడా ఉంది. చాలా కాలం క్రితం కాంచీపురి అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు ధనవతి. వారికి ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. ఆ కుమార్తె పేరు గుణవతి. ఆమె పెళ్లి విషయం వచ్చినప్పుడు జాతకం చూసిన పండితులు ఒక భయంకరమైన విషయం చెప్పారు. పెళ్లైన కొద్ది కాలానికే ఆమె భర్తకు ప్రాణాపాయం ఉందని తెలిపారు. ఈ మాటలు విన్న దేవస్వామి చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియక ఒక సాధువును ఆశ్రయించాడు. ఆ సాధువు ఒక ఉపాయం చెప్పాడు. సింహళ ద్వీపంలో సోమ అనే ఒక దోబీ మహిళ ఉందని, ఆమె చాలా గొప్ప పతివ్రత అని చెప్పాడు. పెళ్లికి ముందు ఆ సోమ గుణవతిని ఆశీర్వదిస్తే ఈ దోషం తొలగిపోతుందని చెప్పాడు.
READ MORE: OTR : GHMC ఎన్నికలకు ముందు తెరపైకి BRS కొత్త ఉద్యమం
అందుకే గుణవతి తన చిన్న తమ్ముడితో కలిసి సింహళ ద్వీపానికి బయలుదేరింది. ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, ఒక గద్ద సహాయంతో వారు అక్కడికి చేరుకున్నారు. సోమ దోబీ ఇంటికి దగ్గరగా ఉండి, గుణవతి ప్రతిరోజూ ఉదయం మౌనంగా ఆమె ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేసేది. చాలా రోజులకు సోమకు ఈ విషయం తెలిసింది. గుణవతి నిజం చెప్పిన తర్వాత, ఆమె మనసు కరిగిపోయింది. సోమ గుణవతితో కలిసి కాంచీపురికి వచ్చింది. పెళ్లికి ముందు పూజలు చేసి గుణవతిని ఆశీర్వదించింది. పెళ్లి తర్వాత అనుకున్నట్లుగానే ఒక అపాయం ఎదురైంది. ఆ సమయంలో సోమ తన సంపాదించిన పుణ్యాన్ని గుణవతికి దానం చేసింది. ఆ పుణ్యబలంతో గుణవతి భర్తకు మళ్లీ జీవితం లభించింది. ఈ కథ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. నిశ్చలమైన మనసుతో, మౌనంతో, భక్తితో చేసే ప్రతి మంచి పని ఎంతో శక్తివంతమైంది. అందుకే మౌనీ అమావాస్య రోజు మౌనం, స్నానం, పూజ, దానం ఇవన్నీ కలిసి మన జీవితానికి శాంతి, సుఖం తీసుకువస్తాయని పెద్దల నమ్మకం.
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!