Koti Deepotsavam 2024: దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం.. 17 రోజుల పాటు సాగిన మహా క్రతువు..
- దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం..
- నవంబర్ 9 నుంచి 25 వరకు దీపాల పండగ..
- 17 రోజుల పాటు దిగ్విజయంగా సాగిన కోటి దీపాల సంబురం..
- విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ముర్ము ..
- రెండు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఆశేష జనవాహిని..
- మహా మంగళ హారతి దర్శనంతో వేడుకలు సమాప్తం..
Koti Deepotsavam 2024: ప్రతీ ఏడాది కార్తిక మాసంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది.. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం 17 రోజుల పాటు కొనసాగాయి.. ఈ నెల 25వ తేదీన అంటే.. కార్తిక చివరి సోమవారం రోజు ముగిసింది.. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 17రోజులపాటు జరిగిన మహాసంబరం ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకుంది. నభూతో నా భవిష్యత్ అనే తీరులో సాగిన కార్యక్రమానికి భారత దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము.. పలు రాష్ట్రాల గవర్నర్లు.. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ , కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, కొండా సురేఖ, పొంగులేటి, తుమ్మల సహా.. హైకోర్టులో న్యాయమూర్తులు.. ఇతర ప్రముఖులు హాజరై ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు.. దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని ప్రశంసలు కురిపించారు..
Read Also: CM Revanth: నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ..
Also Read
ఏటికేడు దైదీప్యమానంగా ఈ మహా సంబరం వెలిగిపోతుంది. గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఈ ఏడాది దేశానికి ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము విచ్చేసారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు. ఇల కైలాసంలో కార్తికమాసం వేళ భక్తి, ఎన్టీవీ చేపుడుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మికను మరింత ముందుకు తీసుకువెళ్తుందుని పీఠాధిపతులు, స్వామిజీలు వేనోళ్ల కొనియాడారు. నవంబర్ 9న ఆరంభమైన దీపాల పండుగ.. నవంబర్ 25 వరకు అప్రతిహాతంగా సాగింది. 17రోజులపాటు సాగిన ఈ మహా క్రతువుకు హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశేష జనవాహిని పాల్గొంది. ప్రతీ రోజు ప్రత్యేక అలంకారాలు.. కోటిదీపోత్సవం దేవికగా దేవానదేవతులు కల్యాణాలు.. రోజుకో పల్లకి సేవా.. ప్రతీ రోజు ఓ విశిష్ట అతిథి.. పీఠాధిపతులు.. మఠాధిపతుల ప్రవచనాలు.. ఇలా 17 రోజుల పాటు భక్తులు పరవశింపజేశాయి.. శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలు.. భక్తజన సంద్రంగా మారిపోయాయి.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపి.. భక్తులను తరలించేందుకు తోడ్పాటును అందించింది.. చివరి రోజు మహా మంగళ హారతి దర్శనంతో కోటి దీపోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ కోటి దీపయజ్ఞం దిగ్విజయం కాకడానికి కృషి చేసిన అందరికీ.. భక్త జనానికి భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ధన్యవాదాలు తెలుపుతోంది..
తాజావార్తలు
-
UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
-
Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
-
Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
-
Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల ‘రొమాంటిక్’ ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
-
Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!