Maruti Suzuki Jimny: ‘మేడ్ ఇన్ ఇండియా’.. జపాన్లో లాంచ్ అయిన “జిమ్నీ ఫైవ్-డోర్”
- 2023లోభారత్లో లాంచ్ అయిన జిమ్నీ ఫైవ్ డోర్
- గురుగ్రామ్లోని ప్లాంట్లో తయారీ
- జపాన్కు ఎగుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి ఇండియా తన’జిమ్నీ ఫైవ్-డోర్’ని తొలిసారిగా జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని గురుగ్రామ్ ప్లాంట్లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. జిమ్నీ ప్రయాణం 2023లో మొదలైంది. భారత్ ఆటో ఎక్స్పో 2023లో దీన్ని ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 7వ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. కాగా.. జపాన్లో జిమ్నీ ధరలు 26,51,000 యెన్- 27,50,000 యెన్ వరకు ఉండనుంది. అంటే భారతీయ రూపాయలలో సుమారు రూ. 14.86 లక్షలు- 15.41 లక్షలు వరకు ఉంటుంది.
విదేశీ మార్కెట్లో ఇది రెండో ఎస్యూవీ…
మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ.. “భారతదేశం తయారు చేసిన జిమ్నీ 5-డోర్ను జపాన్లో ప్రవేశపెట్టాం. ఇది మా కంపెనీ ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాన్ని మరింత హైలైట్ చేస్తుంది.” అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రెండో భారతీయ ఎస్యూవీ ఇది. ఆగస్టు 2024లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ని కంపెనీ జపాన్లో ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జిమ్నీ ఫైవ్ డోర్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Also Read
- Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
- E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్లు..
మారుతి సుజుకి జిమ్నీ అనేక ఫీచర్లతో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్ పి పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఎస్ యూవీలో సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ప్రో 4×4 సిస్టమ్ ఉంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.
మహింద్ర థార్ తో పోటీ
లైఫ్ స్టైల్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో భారత్లోని మహీంద్రా థార్ వంటి ప్రత్యర్థులతో ఈ మారుతి సుజుకీ జిమ్నీ ఎస్ యూవీ పోటీ పడింది. మహీంద్రా థార్ ప్రస్తుతం 5 డోర్ వేరియంట్ లో అందుబాటులోకి రావడంతో దీని ప్రాధాన్యత తగ్గింది. జిమ్నీని విడుదల చేసినప్పటి నుంచి మారుతి సుజుకీ ఈ ఎస్యూవీ ధరల వ్యూహంపై విమర్శలను ఎదుర్కొంది. ఇది అమ్మకాల సంఖ్యను పెంచడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లో దీని ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!