Maruti Suzuki Jimny: ‘మేడ్ ఇన్ ఇండియా’.. జపాన్లో లాంచ్ అయిన “జిమ్నీ ఫైవ్-డోర్”
- 2023లోభారత్లో లాంచ్ అయిన జిమ్నీ ఫైవ్ డోర్
- గురుగ్రామ్లోని ప్లాంట్లో తయారీ
- జపాన్కు ఎగుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి ఇండియా తన’జిమ్నీ ఫైవ్-డోర్’ని తొలిసారిగా జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని గురుగ్రామ్ ప్లాంట్లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. జిమ్నీ ప్రయాణం 2023లో మొదలైంది. భారత్ ఆటో ఎక్స్పో 2023లో దీన్ని ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 7వ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. కాగా.. జపాన్లో జిమ్నీ ధరలు 26,51,000 యెన్- 27,50,000 యెన్ వరకు ఉండనుంది. అంటే భారతీయ రూపాయలలో సుమారు రూ. 14.86 లక్షలు- 15.41 లక్షలు వరకు ఉంటుంది.
విదేశీ మార్కెట్లో ఇది రెండో ఎస్యూవీ…
మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ.. “భారతదేశం తయారు చేసిన జిమ్నీ 5-డోర్ను జపాన్లో ప్రవేశపెట్టాం. ఇది మా కంపెనీ ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాన్ని మరింత హైలైట్ చేస్తుంది.” అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రెండో భారతీయ ఎస్యూవీ ఇది. ఆగస్టు 2024లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ని కంపెనీ జపాన్లో ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జిమ్నీ ఫైవ్ డోర్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Also Read
- BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
- Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్లు..
మారుతి సుజుకి జిమ్నీ అనేక ఫీచర్లతో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్ పి పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఎస్ యూవీలో సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ప్రో 4×4 సిస్టమ్ ఉంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.
మహింద్ర థార్ తో పోటీ
లైఫ్ స్టైల్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో భారత్లోని మహీంద్రా థార్ వంటి ప్రత్యర్థులతో ఈ మారుతి సుజుకీ జిమ్నీ ఎస్ యూవీ పోటీ పడింది. మహీంద్రా థార్ ప్రస్తుతం 5 డోర్ వేరియంట్ లో అందుబాటులోకి రావడంతో దీని ప్రాధాన్యత తగ్గింది. జిమ్నీని విడుదల చేసినప్పటి నుంచి మారుతి సుజుకీ ఈ ఎస్యూవీ ధరల వ్యూహంపై విమర్శలను ఎదుర్కొంది. ఇది అమ్మకాల సంఖ్యను పెంచడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లో దీని ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ram Pothineni: ‘వీరా’ పాత్రలో రామ్.. హీరోయిన్పై ఆసక్తికర టాక్
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!