Maruti Suzuki Jimny: ‘మేడ్ ఇన్ ఇండియా’.. జపాన్లో లాంచ్ అయిన “జిమ్నీ ఫైవ్-డోర్”
- 2023లోభారత్లో లాంచ్ అయిన జిమ్నీ ఫైవ్ డోర్
- గురుగ్రామ్లోని ప్లాంట్లో తయారీ
- జపాన్కు ఎగుమతి
మారుతి సుజుకి ఇండియా తన’జిమ్నీ ఫైవ్-డోర్’ని తొలిసారిగా జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని గురుగ్రామ్ ప్లాంట్లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. జిమ్నీ ప్రయాణం 2023లో మొదలైంది. భారత్ ఆటో ఎక్స్పో 2023లో దీన్ని ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 7వ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. కాగా.. జపాన్లో జిమ్నీ ధరలు 26,51,000 యెన్- 27,50,000 యెన్ వరకు ఉండనుంది. అంటే భారతీయ రూపాయలలో సుమారు రూ. 14.86 లక్షలు- 15.41 లక్షలు వరకు ఉంటుంది.
విదేశీ మార్కెట్లో ఇది రెండో ఎస్యూవీ…
మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ.. “భారతదేశం తయారు చేసిన జిమ్నీ 5-డోర్ను జపాన్లో ప్రవేశపెట్టాం. ఇది మా కంపెనీ ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాన్ని మరింత హైలైట్ చేస్తుంది.” అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రెండో భారతీయ ఎస్యూవీ ఇది. ఆగస్టు 2024లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ని కంపెనీ జపాన్లో ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జిమ్నీ ఫైవ్ డోర్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Also Read
- BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్లు..
మారుతి సుజుకి జిమ్నీ అనేక ఫీచర్లతో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్ పి పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఎస్ యూవీలో సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ప్రో 4×4 సిస్టమ్ ఉంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.
మహింద్ర థార్ తో పోటీ
లైఫ్ స్టైల్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో భారత్లోని మహీంద్రా థార్ వంటి ప్రత్యర్థులతో ఈ మారుతి సుజుకీ జిమ్నీ ఎస్ యూవీ పోటీ పడింది. మహీంద్రా థార్ ప్రస్తుతం 5 డోర్ వేరియంట్ లో అందుబాటులోకి రావడంతో దీని ప్రాధాన్యత తగ్గింది. జిమ్నీని విడుదల చేసినప్పటి నుంచి మారుతి సుజుకీ ఈ ఎస్యూవీ ధరల వ్యూహంపై విమర్శలను ఎదుర్కొంది. ఇది అమ్మకాల సంఖ్యను పెంచడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లో దీని ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో