Maruti Suzuki Jimny: ‘మేడ్ ఇన్ ఇండియా’.. జపాన్లో లాంచ్ అయిన “జిమ్నీ ఫైవ్-డోర్”
- 2023లోభారత్లో లాంచ్ అయిన జిమ్నీ ఫైవ్ డోర్
- గురుగ్రామ్లోని ప్లాంట్లో తయారీ
- జపాన్కు ఎగుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి ఇండియా తన’జిమ్నీ ఫైవ్-డోర్’ని తొలిసారిగా జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని గురుగ్రామ్ ప్లాంట్లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. జిమ్నీ ప్రయాణం 2023లో మొదలైంది. భారత్ ఆటో ఎక్స్పో 2023లో దీన్ని ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 7వ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. కాగా.. జపాన్లో జిమ్నీ ధరలు 26,51,000 యెన్- 27,50,000 యెన్ వరకు ఉండనుంది. అంటే భారతీయ రూపాయలలో సుమారు రూ. 14.86 లక్షలు- 15.41 లక్షలు వరకు ఉంటుంది.
విదేశీ మార్కెట్లో ఇది రెండో ఎస్యూవీ…
మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ.. “భారతదేశం తయారు చేసిన జిమ్నీ 5-డోర్ను జపాన్లో ప్రవేశపెట్టాం. ఇది మా కంపెనీ ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాన్ని మరింత హైలైట్ చేస్తుంది.” అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రెండో భారతీయ ఎస్యూవీ ఇది. ఆగస్టు 2024లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ని కంపెనీ జపాన్లో ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జిమ్నీ ఫైవ్ డోర్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Also Read
- Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
- Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
- Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
- Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్లు..
మారుతి సుజుకి జిమ్నీ అనేక ఫీచర్లతో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్ పి పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఎస్ యూవీలో సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ప్రో 4×4 సిస్టమ్ ఉంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.
మహింద్ర థార్ తో పోటీ
లైఫ్ స్టైల్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో భారత్లోని మహీంద్రా థార్ వంటి ప్రత్యర్థులతో ఈ మారుతి సుజుకీ జిమ్నీ ఎస్ యూవీ పోటీ పడింది. మహీంద్రా థార్ ప్రస్తుతం 5 డోర్ వేరియంట్ లో అందుబాటులోకి రావడంతో దీని ప్రాధాన్యత తగ్గింది. జిమ్నీని విడుదల చేసినప్పటి నుంచి మారుతి సుజుకీ ఈ ఎస్యూవీ ధరల వ్యూహంపై విమర్శలను ఎదుర్కొంది. ఇది అమ్మకాల సంఖ్యను పెంచడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లో దీని ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!