EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- భారత్లో జోరు మీదున్న EV మార్కెట్..
- 2032 నాటికి భారత్లో ఏటా 3.04 కోట్ల EVలు అమ్ముడయ్యే అవకాశం.
- 2024లో 20 లక్షలుగా ఉన్న అమ్మకాలు 2025లో 26 లక్షలకు పెరిగాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EV Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు మీదు ఉంది. ఈవీ మార్కెట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మరింత పుంజుకుంటుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్IESA) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల్ని ప్రోత్సహించడం, కొన్ని రాయితీలు ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించడంతో చాలా మంది ఈవీల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 2032 నాటికి దేశంలో ఏటా 3.04 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. అంతేకాకుండా, కార్ల అమ్మకాలు దాదాపు 12 రెట్లు పెరగవచ్చు. ఈ నివేదికను కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (CES) వారు తయారుచేశారు.
ఏకంగా 26 శాతం పెరిగిన అమ్మకాలు:
నివేదిక ప్రకారం, భారత్లో ఈవీల అమ్మకాలు 2024లో 20 లక్షల యూనిట్ల నుంచి 2025 నాటికి 26 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఒక్క ఏడాదిలో 26 శాతం వృద్ధి నమోదైంది. వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2024లో 8.1 శాతం ఉండగా, 2025లో అది 9.5 శాతానికి పెరిగింది. ఇది భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నట్లు సూచిస్తోంది.
Also Read
- Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
2025లో మొత్తం ఈవీ అమ్మకాలలో 60.1 శాతం వాటాతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనాలు 31.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు విభాగాలు కలిసి దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 91 శాతానికి పైగా వాటాను అందించాయి. ప్రస్తుతం దేశంలో ఈవీ బూమ్కు ఈ రెండు సెగ్మెంట్లే కీలకంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 7.7 శాతానికి పెరిగింది. ఇది బ్యాటరీలతో నడిచే కార్లను వేగంగా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల వాటా 0.2 శాతం, ఎలక్ట్రిక్ టక్కుల వాటా 0.4 శాతంగా ఉంది.
పెరుగుతున్న బ్యాటరీ డిమాండ్:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో బ్యాటరీ డిమాండ్ వేగంగా పెరుతుందని నివేదిక వెల్లడించింది. 2025 మొత్తం బ్యాటరీ డిమాండ్ 19 GWh ఉండగా, 2032 నాటికి అది 362 GWhకు చేరుకోవచ్చు. ఈవీల సంఖ్య, భారీ బ్యాటరీ ప్యాక్ వాడకమే ఇందుకు కారణం. 2025 బ్యాటరీ డిమాండ్లో ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు మొత్తం బ్యాటరీ డిమాండ్లో 40 శాతం వాటా కలిగి ఉండగా, త్రీ-వీలర్లు 27 శాతం, టూ-వీలర్లు 23 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం ఈవీ విడిభాగాల మార్కెట్లో బ్యాటరీ ప్యాక్లు 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, మోటార్లు 22 శాతం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 11 శాతం, DC-DC కన్వర్టర్లు 3 శాతం వాటా కలిగి ఉన్నాయి. స్థానిక తయారీ, సప్లై చైన్లో విడిభాగాల స్ధానికీకరణ ఈ మార్కెట్కు సవాల్ విసురుతోంది. వీటిని పరిష్కరిస్తే ఇండియాలో ఈవీ మార్కెట్ మరింత వృద్ధి చెందగలదు.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!