EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- భారత్లో జోరు మీదున్న EV మార్కెట్..
- 2032 నాటికి భారత్లో ఏటా 3.04 కోట్ల EVలు అమ్ముడయ్యే అవకాశం.
- 2024లో 20 లక్షలుగా ఉన్న అమ్మకాలు 2025లో 26 లక్షలకు పెరిగాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EV Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు మీదు ఉంది. ఈవీ మార్కెట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మరింత పుంజుకుంటుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్IESA) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల్ని ప్రోత్సహించడం, కొన్ని రాయితీలు ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించడంతో చాలా మంది ఈవీల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 2032 నాటికి దేశంలో ఏటా 3.04 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. అంతేకాకుండా, కార్ల అమ్మకాలు దాదాపు 12 రెట్లు పెరగవచ్చు. ఈ నివేదికను కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (CES) వారు తయారుచేశారు.
ఏకంగా 26 శాతం పెరిగిన అమ్మకాలు:
నివేదిక ప్రకారం, భారత్లో ఈవీల అమ్మకాలు 2024లో 20 లక్షల యూనిట్ల నుంచి 2025 నాటికి 26 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఒక్క ఏడాదిలో 26 శాతం వృద్ధి నమోదైంది. వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2024లో 8.1 శాతం ఉండగా, 2025లో అది 9.5 శాతానికి పెరిగింది. ఇది భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నట్లు సూచిస్తోంది.
Also Read
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
- Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
- 7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
2025లో మొత్తం ఈవీ అమ్మకాలలో 60.1 శాతం వాటాతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనాలు 31.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు విభాగాలు కలిసి దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 91 శాతానికి పైగా వాటాను అందించాయి. ప్రస్తుతం దేశంలో ఈవీ బూమ్కు ఈ రెండు సెగ్మెంట్లే కీలకంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 7.7 శాతానికి పెరిగింది. ఇది బ్యాటరీలతో నడిచే కార్లను వేగంగా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల వాటా 0.2 శాతం, ఎలక్ట్రిక్ టక్కుల వాటా 0.4 శాతంగా ఉంది.
పెరుగుతున్న బ్యాటరీ డిమాండ్:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో బ్యాటరీ డిమాండ్ వేగంగా పెరుతుందని నివేదిక వెల్లడించింది. 2025 మొత్తం బ్యాటరీ డిమాండ్ 19 GWh ఉండగా, 2032 నాటికి అది 362 GWhకు చేరుకోవచ్చు. ఈవీల సంఖ్య, భారీ బ్యాటరీ ప్యాక్ వాడకమే ఇందుకు కారణం. 2025 బ్యాటరీ డిమాండ్లో ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు మొత్తం బ్యాటరీ డిమాండ్లో 40 శాతం వాటా కలిగి ఉండగా, త్రీ-వీలర్లు 27 శాతం, టూ-వీలర్లు 23 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం ఈవీ విడిభాగాల మార్కెట్లో బ్యాటరీ ప్యాక్లు 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, మోటార్లు 22 శాతం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 11 శాతం, DC-DC కన్వర్టర్లు 3 శాతం వాటా కలిగి ఉన్నాయి. స్థానిక తయారీ, సప్లై చైన్లో విడిభాగాల స్ధానికీకరణ ఈ మార్కెట్కు సవాల్ విసురుతోంది. వీటిని పరిష్కరిస్తే ఇండియాలో ఈవీ మార్కెట్ మరింత వృద్ధి చెందగలదు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!