EV Sales in India: ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 36 లక్షల ఈవీలు సేల్.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అమ్ముడయ్యాయంటే..?
- ఇండియాలో ఈవీ (EV)ల అమ్మకం
- ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్న జనాలు
- ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా 36 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. అందులో.. టాప్-5లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి..? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..
Also Read
- 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య ఐదేళ్లలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. దీంతో పాటు.. దేశంలోని ఏయే రాష్ట్రాల్లో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందించింది. సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 3639617 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈవీలు అమ్మకాల పరంగా అత్యధిక నమోదు అయిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య ఉత్తరప్రదేశ్లో 665247 యూనిట్ల ఈవీలు అమ్మకం జరిగాయి. ఆ తర్వాత 439358 యూనిట్ల ఈవీలు అమ్మకాలు జరిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో కర్ణాటకలో 350810 యూనిట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 228850 యూనిట్లు నమోదయ్యాయి. 233503 యూనిట్ల నమోదుతో రాజస్థాన్ టాప్-5 జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అలాగే.. ఢిల్లీ ఏడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో మొత్తం 216084 యూనిట్లు నమోదయ్యాయి.
Read Also: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ MORTH పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2019-2024 మధ్య సిక్కింలో ఒక్క ఎలక్ట్రిక్ వాహనం కూడా అమ్ముడు కాలేదు. అలాగే.. లక్షద్వీప్లో 19, నాగాలాండ్లో 27, అరుణాచల్ ప్రదేశ్లో 42, లడఖ్లో 88, అండమాన్ మరియు నికోబార్లో 191, దాదర్ నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలో 468, మిజోరాంలో 344, మేఘాలయలో 572, మణిపూర్లో 12304, హిమాచల్ ప్రదేశ్ , పుదుచ్చేరిలో 5933 యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!