ఒక నెటిజన్.. ‘‘మొసలి రక్షించబడింది, లేకపోతే దాని లోపల ఉన్న మొత్తం బయటకు వచ్చేది’’ అని వ్యాఖ్యానించారు. మరొకరు మొసలి తప్పించుకున్నా కూడా తన పిల్లను రక్షించుకోవడానికి ఇంకా తల్లి ఏనుగు చెరువులో వెతుకుతూనే ఉందని, ఇది తల్లి పిల్లల రక్షణ పట్ల ఉన్న ప్రవృత్తి అన్నారు.
Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం,
Tomatoes grown in space: అంతరిక్షం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. మనం ఇప్పటి వరకు అంతరిక్షం గురించి, విశ్వం గురించి తెలుసుకుంది చాలా తక్కువ మాత్రమే. అంతరిక్షంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పూర్తిగా శూన్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు కొన్ని నెలల పాటు ఉంటూ పలు పరిశోధనలు చేస్తుంటారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడని అధికారుల చేత నిర్థారించబడిన వ్యక్తి రెండేళ్లకు సజీవంగా ఇంటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, సన్నిహితులను షాకింగ్ కు గురిచేయడంతో పాటు తమ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని అంతా సంతోషిస్తున్నారు.
Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని ఆయన అన్నారు.
ఇటీవల బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ సచిన్ పైలెట్ దీక్ష చేపట్టారు. దీంతో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. ఈ సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది.
IPL 2023 RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది. 23 పరుగుల తేడాలో ఆర్సీబీ, డీసీని ఓడించింది. దీంతో ఐపీఎల్ 2023లో బెంగళూర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్సింగ్స్ లో ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించలేకపోయింది. ఏ దశలోనూ ఢిల్లీ గెలుస్తుందనే ఆశ నెలకొనలేదు. వరసగా బ్యాటర్లు ఔట్ అవ్వడంతో కుదురుకునేవారు ఒక్కరూ లేకపోయారు.
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండటంతో సన్నాహక చర్యలపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యారు.
Shahjahanpur Accident: ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గర్రా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. 42 మందితో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా వంతెనపై నుంచి కింద పడింది. తిల్హార్ పోలీస్ స్టేషన్లోని బిర్సింగ్పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమకు అడ్డురాని మతం, పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. ఇస్లాంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లవర్ చెప్పడంతో ఇది ఇష్టం లేని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో 24 ఏళ్ల షారూఖ్ అనే నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.