Madhya Pradesh: కరోనాతో చనిపోయినట్లు ప్రకటించబడిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత సజీవంగా ఇంటికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడని అధికారుల చేత నిర్థారించబడిన వ్యక్తి రెండేళ్లకు సజీవంగా ఇంటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, సన్నిహితులను షాకింగ్ కు గురిచేయడంతో పాటు తమ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని అంతా సంతోషిస్తున్నారు.
Read Also: Amit Shah: “పైలట్ జీ మీ నంబర్ ఎప్పుడూ రాదు”.. రాజస్థాన్ కాంగ్రెస్ పోరుపై అమిత్ షా వ్యాఖ్యలు..
Also Read
2021 లో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ లో కమలేష్ అనే వ్యక్తి మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల కమలేష్ కరోనాతో మరణించాడని అధికారులు మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా స్పెషల్ ఆపరేటింగ్ విధానాల(ఎస్ఓపీ) ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా కమలేష్ రెండేళ్ల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు.
రెండేళ్లుగా తాను అహ్మదాబాద్ లో ఓ ముఠాతో కలిసి ఉన్నానని, ప్రతీ రోజూ తనకు మత్తు ఇంజక్షన్ ఇస్తున్నారని వెల్లడించాడు. కమలేష్ ను అతడి భార్య, కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే దీనిపై ధార్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బతికున్న వ్యక్తిని ఎలా చనిపోయారని ప్రకటించారనేదానిపై విచారణ జరుపుతున్నారు. మరణించిన వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!