Venu Goapl Reddy
Author- NTV Telugu-
Shocking Crime: మిల్క్ షేక్లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..
Shocking Crime: మహారాష్ట్రలో తండ్రిని హత్య చేసిన నేరం వెలుగులోకి వచ్చింది. చంద్రపూర్ జిల్లాలో సొంత కూతురే తండ్రిని విషం పెట్టి హత్య చేసింది. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఈ హత్య బయటకు వచ్చింది. ఈ కేసులో మాస్టర్ మైండ్ కూతురే అని పోలీసులు గుర్తించారు. ప్రియుడి సహాయంతో ఈ హత్యకు సదరు యువతి ప్లాన్ కేసింది. తండ్రికి మిల్క్షేక్లో విషం కలిపి ఇచ్చి చంపేసింది. దీనిని ముందుగా సహజ మరణంగా నిందితులు ప్లాన్ చేశారు. […] -
US-Iran Conflict: దుబాయ్ హోటళ్లపై దాడులు చేస్తాం.. యూఎస్కు ఇరాన్ అల్టిమేటం..
US-Iran Conflict: అమెరికా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించి, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ గట్టి అల్టిమేటం ఇచ్చింది. అమెరికా సైనికులు బస చేస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తామని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న యూఎస్ సైనికులు తమ స్థావరాలను వదిలేసి హోటళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారని, అమెరికన్లకు ఆశ్రయం ఇచ్చే హోటళ్లను అమెరికా ఆస్తులుగానే పరిగణిస్తామని హెచ్చరించింది. -
India-Russia: రష్యా ఆయిల్ దిగుమతులు డబుల్.. కీలక ఒప్పందం దిశగా భారత్..
India-Russia: ఇరాన్ యుద్ధం రష్యా పంట పండిస్తోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యన్ క్రూడ్ ఆయిల్కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని పెంచాలని చూస్తోంది. -
US-Israel: యుద్ధంపై ఇరాన్ తీపి కబురు.. తెరవెనక 2 దేశాల మధ్యవర్తిత్వం..
Iran War: మిడిల్ ఈస్ట్ సంక్షోభాల మధ్య కాస్త ఉపశమనం కలిగించే వార్త ఇరాన్ అధికారి నుంచి వచ్చింది. యుద్ధం నిలిచేందుకు తెర వెనక చర్చలు జరుగుతున్నట్లు సీనియర్ ఇరాన్ అధికారి తెలిపారు. ఈ సంఘర్షణను చల్లార్చడానికి టర్కీ, పాకిస్తాన్లు ఇప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరించడం ప్రారంభించాయి. ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్, అమెరికాల మధ్య పరస్పరం అంగీకరించే ఒక మధ్యే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. Read Also: Iran War: ఇరాన్ను లొంగదీయడానికి ట్రంప్ ముందు […] -
Iran War: ఇరాన్ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.
Iran War: ఇరాన్ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరినా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా, ఇజ్రాయిల్కు ఎదురు నిలిచి దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా బేస్లు, కీలక చమురు సదుపాయాలపై దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్ను తుది దెబ్బ తీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు ఉన్నాయి. 1) మొదటిది […] -
Social Media: సోషల్ మీడియాకు కేవైసీ తప్పనిసరి..?
Social Media: ఆన్లైన్ హాని నుంచి మహిళలు, పిల్లల్ని రక్షించే ఉద్దేశంతో, సోషల్ మీడియాకు కేవైసీ తప్పనిసరి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది, దీనికి బానిసగా మారుతున్నవారు కూడా ఉన్నారు. -
Bengaluru Crime: మహిళ, ఆమె సోదరుడి హత్య.. ప్రేయసి కుమారుడే నిందితుడు..
Bengaluru Crime: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. బెంగళూర్లో ఒక మైనర్ బాలుడు మహిళ, ఆమె సోదరుడిని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. పీన్యా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులను మల్లే గౌడ భార్య యమున(36) ఆమె సోదరుడు సుదీప్(34)గా గుర్తించారు. నిందితుడు 16 ఏళ్ల బాలుడని తేలింది. ఇతను ఛాయా అనే మహిళ కుమారుడని సమాచారం. -
Anthropic: ల్యాప్టాప్ అవసరం లేదు, మొబైల్లోనే ఆఫీస్ వర్క్.. ఆంథ్రోపిక్ సూపర్ యాప్..
Anthropic: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రాకతో టెక్నాలజీ వేగంగా మారుతోంది. మానవ జీవితం ఏఐతో మరింత సులభతరం అవుతోంది. తాజాగా ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్(Anthropic) తన “క్లాడ్” మొబైల్ యాప్లో కీలక అప్డేట్ తీసుకువచ్చింది. దీని ద్వారా ల్యాప్టాప్, డెస్క్టాప్ అవసరం లేకుండానే మొబైల్ ద్వారా అనేక వర్క్ టూల్స్ ఉపయోగించి ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్ తో క్లాడ్ యాప్లోనే ఫిగ్మా, కాన్వా లాంటి యాప్లను ఉపయోగించుకోవచ్చు. క్లాడ్ యాప్ నుంచి బయటకు […] -
West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల్లో ప్రచారహోరు ముమ్మరమైంది. ముఖ్యంగా టీఎంసీ, బీజేపీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందుకు అధికారి సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి సువేందు కూడా పోటీలో నిలబడ్డారు. గత ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించి సంచలనం సృష్టించారు. Read Also: Vanitha TV : శ్రీరామనవమి వేడుకల్లో.. కొండల స్వామి […] -
Crime: బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు.. 25 మంది బాలికలపై లైంగిక వేధింపులు..
Crime: దక్షిణ గోవాలో సుమారు 25-30 మందికి మైనర్ బాలికపై లైంగిక దోపిడికి పాల్పడిన కేసులో బీజేపీ కార్పొరేటర్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల సోహమ్ నాయక్ను గోవా పోలీసులు అదుపులోకి తీసకున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితుడు సోహమ్ తండ్రి సుశాంత్ నాయక్ బీజేపీ కార్పొరేటర్. ప్రాథమిక విచారణలో దాదాపుగా 3 ఏళ్ల నుంచి బాధితుల్ని వేధిస్తూ, బెదిరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. Read Also: Karnataka: క్లాస్లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..