Venu Goapl Reddy
Author- NTV Telugu-
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
Petrol-Diesel Price Hike: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు భారత్ ఇంధన భద్రతను ఇరాన్ యుద్ధం ప్రభావితం చేసింది. ప్రపంచం చమురులో 20 శాతం అవసరాలకు కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరాన్, అమెరికా ఘర్షణ పడుతున్నాయి. దీంతో గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా చాలా వరకు తగ్గిపోయింది. ఇదిలా ఉంటే, భారత్లో ఇటీవల […] -
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్మనీ”పై టీఎంసీలో భయం..
West Bengal:పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 15 ఏళ్లుగా చాలా మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు, నేతలు ప్రజలపై అనేక దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఘోర పరాజయం తర్వాత, బీజేపీకి అధికారంలోకి రావడంతో ప్రజలు టీఎంసీపై తిరగబడుతున్నారు. చాలా ప్రాంతాల్లో తమను పీడించిన తృణమూల్ నేతలు, కార్యకర్తల బట్టలూడదీసి కొడుతున్నారు. ముఖ్యంగా ‘‘కట్మనీ’’ వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కట్మనీ వ్యవహారంపై సీఎం […] -
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
Brahmos: భారత్ అభివృద్ధి చేసిన ‘‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. పలు దేశాలు ఈ క్షిపణని కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు బ్రహ్మోస్ అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దీనికి ముందు ఫిలిప్పీన్స్ కూడా ఈ క్షిపణిని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ఇండోనేషియాతో కూడా ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. చైనా సమీపంలో ఈ దేశాలు బ్రహ్మోస్ […] -
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. నిన్న సోనార్పూర్లో తృణమూల్ కాంగ్రెస్ నెంబర్ 2, మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధిత తృణమూల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో స్థానికులు దాడికి దిగారు. తనపై బీజేపీ కక్షసాధింపు పాల్పడుతోందని అభిషేక్ ఆరోపించారు. పాలకులు హంతకుల్లా మారారని మమతా బెనర్జీ ఆరోపించింది. ఇదిలా ఉంటే, తాజాగా మమతా బెనర్జీ కోల్కతాలోని బెల్లే వ్యూ హాస్పిటల్ […] -
Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
Wife Harassment: భార్య వేధింపులు భరించలేక ఒక భర్త కారుణ్య మరణాన్ని కోరుతూ అధికారుల్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. తన భార్య, అత్తింటి వారు, బావమరిది వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, వారికి శిక్ష విధించలేకపోతే తనకు మరణించే అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. బాబుభాయ్ పటేల్ అనే వ్యక్తి తన భార్య మోనికా చౌహాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె కుటుంబం తనను తప్పుడు కేసుల్లో ఇరికించి మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు […] -
Mamata Banerjee: అభిషేక్పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సోనార్పూర్లో మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. స్థానిక ప్రజలు ఆగ్రహంతో శనివారం ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘‘పాలకులు హంతకులుగా మారారు’’ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. అభిషేక్ దాడిపై ప్రతిపక్షాలు […] -
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
Abhishek Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతడిపై పలు కేసుల్లో విచారణ జరుగుతోంది. తాజాగా బెంగాల్ సీఐడీ అతడిని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం అభిషేక్ కార్యాలయం అయిన ‘‘శాంతినికేతన్’’కు చేరుకుని నోటీసులు ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారు. సోమవారం సీఐడీ కార్యాలయం భవానీ భవన్కు […] -
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, కార్యకర్తలు కనిపిస్తే సాధారణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చాలా చోట్ల టీఎంసీ నేతల్ని ప్రజలు కొడుతున్నారు. మమతా బెనర్జీ హయాంలో తమపై జరిగిన అకృత్యాలకు ప్రజలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. టీఎంసీ కార్యకర్తలు, నేతలు కట్ మనీ రూపంలో తమను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల టీఎంసీ గుండాలు ప్రజల స్థలాలను ఆక్రమించుకుని పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి బీజేపీ వచ్చిన వెంటనే ప్రజలు […] -
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
USA: సింగపూర్లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ భారత్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక ‘‘శక్తివంతమైన దేశం’’ అని, భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని అన్నారు. ఇదే సమయంలో గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేసినట్లు చెప్పారు. అయితే, పలు సందర్బాల్లో సిందూర్ ఆపే విషయంలో ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదని, పాక్ […] -
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహింసా మానవాళికి పరమ ధర్మమని చెబుతూనే, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారితే అలాంటి పరిస్థితుల్లో అహింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. దేశరక్షణ కోసం అవసరమైతే బలప్రయోగం, ధర్మ హింస ముఖ్యమే అని స్పష్టం చేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అహింసా పరమో […]
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?