Venu Goapl Reddy
Author- NTV Telugu-
Kodandaram: సీఎంకు తన భద్రత మీద ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై లేదు
మహిళల భద్రతపై, సమస్యలపై రోశయ్య హాయాంలో సమావేశం జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సమావేశం పెట్టలేదని విమర్శించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రతిపక్ష నాయకులు ప్రగతి భవన్ కు ఎలా వచ్చారని సమీక్ష చేసుకుంటారు కానీ.. తెలంగాణలో మహిళలపై దాడి చేస్తే సమీక్ష ఎందుకు చేయరని ప్రశ్నించారు. సీఎంకు తన భద్రత మీద ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆయన గురించే ఆలోచిస్తున్నారు..ఆయన గురించే […] -
Jagadish Reddy: ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయని విమర్శించారు. దేశ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకమైన పద్దతిలో పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన మొదటి నుండి అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ […] -
Asaduddin Owaisi: యోగీ ఆదిత్యనాథ్ ‘ సూపర్ చీఫ్ జస్టిస్’ గా వ్యవహరిస్తున్నారు.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాథ్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాళ్ల దాడి, ఆస్తుల ధ్వంసం జరిగింది. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ అల్లర్లను అణచివేయడంతో పాటు శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై […] -
Agnipath scheme: ఆర్మీలో కొత్త స్కీమ్ ప్రకటించిన రాజ్ నాథ్ సింగ్.. కీలక అంశాలు ఇవే
భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, జీతం, పెన్షన్ బిల్లులను తగ్గించడంతో పాటు ఆధునాతన ఆయుధాలను సేకరణ కోసం నిధులను ఖర్చు చేయాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, దేశ త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. రాజ్ నాథ్ సంగ్ ఇది చారిత్రక నిర్ణయం అని అన్నారు. అగ్నిపథ్ పథకంలోని ముఖ్యాంశాలు: పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న 45,000 మంది యువతీయువకులను […] -
Narendra Modi: ఈ నెల 16, 17న రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం
కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తుందని పలు రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాల బలోపేతం కోసం జూన్ 16,17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పీఎం నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలు, అభివృద్ధి విధానాలపై చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్ లతో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించనున్నారు. రాష్ట్రాలు […] -
Congress: ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ భారీ నిరసనలు
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) రెండో రోజు ప్రశ్నిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు విచారించిన ఈడీ దాదాపుగా 10 గంటల పాటు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. మంగళవారం రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఇదిలా ఉంటే ఢిల్లీ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు […] -
Swiggy-Zomato: ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరచాలి.. ప్రభుత్వం ఆదేశం
దేశంలో ఫుడ్ డెలవరీ బిజినెస్ ఆపరేటర్లు పెరిగిపోతున్నారు. స్విగ్గీ, జొమాటోతో పాటు మరికొన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల ఫుడ్ డెలవరీ ఆపరేటర్లకు భలే గిరాకీ పెరిగింది. కొన్నాళ్లుగా మెట్రోలు, ప్రధాన నగరాలకే పరిమితం అయిన ఫుడ్ డెలవరీ రంగం ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కస్టమర్ల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటిని పరిష్కరించే మార్గాలను ఫుడ్ డెలవరీ ఆపరేటర్లు విస్మరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. […] -
India-Russia: భారత్ కు రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా
ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా అనేక ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొనుగోలుపై పలు పాశ్చాత్య దేశాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రష్యా నుంచి వైదొలుగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా ఉక్రెయిన్ పై దాడిని ఆపడం లేదు రష్యా. ఇదిలా ఉంటే భారత్ కు అతి తక్కువ రేటుకే రష్య చమురును ఆఫర్ చేసింది. దీంతో ఇండియా […] -
Corona: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 6594 కేసులు
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. త్వరలో కరోనా ఫోర్త్ వేవ్ రాబోతుందా అనే భయాలు వెంటాడుతున్నాయి. గతం కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి దేశంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేల లోపే ఉంటోంది. అయితే గత వారం నుంచి మాత్రం అనూహ్యంగా కేసులు 6 వేలు, 7 వేలకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఎక్కువ గా కేసులు […] -
Kerala: సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా విమానంలో కాంగ్రెస్ నిరసన..
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చేస్తోంది. కేరళ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలిపిన ఓ నిరసన తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయన్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఎగురుతున్న విమానంలో నినాదాలు చేశారు. సోమవారం కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానంలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్లచొక్కాలు ధరించి విజయన్ రాజీనామా చేయాలని […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!