Swiggy-Zomato: ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరచాలి.. ప్రభుత్వం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఫుడ్ డెలవరీ బిజినెస్ ఆపరేటర్లు పెరిగిపోతున్నారు. స్విగ్గీ, జొమాటోతో పాటు మరికొన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల ఫుడ్ డెలవరీ ఆపరేటర్లకు భలే గిరాకీ పెరిగింది. కొన్నాళ్లుగా మెట్రోలు, ప్రధాన నగరాలకే పరిమితం అయిన ఫుడ్ డెలవరీ రంగం ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కస్టమర్ల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటిని పరిష్కరించే మార్గాలను ఫుడ్ డెలవరీ ఆపరేటర్లు విస్మరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్( వినియోగదారుల వ్యహహారాల విభాగం) స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి 15 రోజుల్లో ప్రతిపాదనలు అందించాలని ఆదేశించింది. డిపార్ట్మెంట్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ (1915)కి గత ఏడాది కాలంలో స్విగ్గీపైన 3631 ఫిర్యాదులు నమోదు కాగా.. జొమాటో పై 2828 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. తాజాగా జరిగిన ఈ సమావేశంలో ప్రధాన సమస్యలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఫిర్యాదుల్లో ఎక్కువగా డెలవరీ, ప్యాకింగ్ ఛార్జీల విషయంలో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు రెస్టారెంట్ ద్వారా ఆర్డర్ చేసే సమయంలో వినియోగదారుడికి చూపించే డెలివరీ సమయం, డెలివరీ చేసే సమయంల వాస్తవానికి దూరంగా ఉంటుందని.. ఇదే సమయంలో ఆహార పదార్థాల ధర, పరిమాణాల్లో కూడా తేడాలు ఉంటున్నట్లు వినియోగదారులు ఫిర్యాదుల్లో చేస్తున్నారని సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
అయితే ఇ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు వినియోగదారుల సమస్యలను రెస్టారెంట్లతో పంచుకోవడం లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఎన్ఆర్ఏఐ) ఆరోపించింది. ఫుడ్ డెలివరీ ఛార్జీలు పుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్స్ ద్వారానే నిర్ణయించబడుతాయని, వసూలు చేయబడతాయని పేర్కొన్నారు. అయితే ఆర్డర్ మొత్తంలో డెలివరీ ఛార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులు మొదలైనవి వినియోగదారుడికి పారదర్శకంగా చూపించాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!