Swiggy-Zomato: ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరచాలి.. ప్రభుత్వం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఫుడ్ డెలవరీ బిజినెస్ ఆపరేటర్లు పెరిగిపోతున్నారు. స్విగ్గీ, జొమాటోతో పాటు మరికొన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల ఫుడ్ డెలవరీ ఆపరేటర్లకు భలే గిరాకీ పెరిగింది. కొన్నాళ్లుగా మెట్రోలు, ప్రధాన నగరాలకే పరిమితం అయిన ఫుడ్ డెలవరీ రంగం ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కస్టమర్ల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటిని పరిష్కరించే మార్గాలను ఫుడ్ డెలవరీ ఆపరేటర్లు విస్మరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్( వినియోగదారుల వ్యహహారాల విభాగం) స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి 15 రోజుల్లో ప్రతిపాదనలు అందించాలని ఆదేశించింది. డిపార్ట్మెంట్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ (1915)కి గత ఏడాది కాలంలో స్విగ్గీపైన 3631 ఫిర్యాదులు నమోదు కాగా.. జొమాటో పై 2828 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. తాజాగా జరిగిన ఈ సమావేశంలో ప్రధాన సమస్యలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఫిర్యాదుల్లో ఎక్కువగా డెలవరీ, ప్యాకింగ్ ఛార్జీల విషయంలో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు రెస్టారెంట్ ద్వారా ఆర్డర్ చేసే సమయంలో వినియోగదారుడికి చూపించే డెలివరీ సమయం, డెలివరీ చేసే సమయంల వాస్తవానికి దూరంగా ఉంటుందని.. ఇదే సమయంలో ఆహార పదార్థాల ధర, పరిమాణాల్లో కూడా తేడాలు ఉంటున్నట్లు వినియోగదారులు ఫిర్యాదుల్లో చేస్తున్నారని సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
అయితే ఇ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు వినియోగదారుల సమస్యలను రెస్టారెంట్లతో పంచుకోవడం లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఎన్ఆర్ఏఐ) ఆరోపించింది. ఫుడ్ డెలివరీ ఛార్జీలు పుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్స్ ద్వారానే నిర్ణయించబడుతాయని, వసూలు చేయబడతాయని పేర్కొన్నారు. అయితే ఆర్డర్ మొత్తంలో డెలివరీ ఛార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులు మొదలైనవి వినియోగదారుడికి పారదర్శకంగా చూపించాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!