Venu Goapl Reddy
Author- NTV Telugu-
Joe Biden: చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు.. మరిన్ని రహస్య పత్రాలు స్వాధీనం..
More classified documents found from US President Biden's residence, private office: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో మరన్ని రహస్య పత్రాలను కనుక్కున్నట్లు వైట్ హౌజ్ గురువారం తెలిపింది. ఈ రహస్య పత్రాలు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీటిపై విచారణ ప్రారంభం అయింది. వాషింగ్టన్ లోని బైడెన్ ప్రైవేటు ఆఫీస్ నుంచి ఈ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు -
Sharad Yadav: మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
Former Union Minister Sharad Yadav Dies At 75: ప్రముఖ సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి, జేడీయూ వ్యవస్థాపక సభ్యుడు శరద్ యాదవ్(75)కన్నుమూశారు. చాలా కాలంగా శరద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఢిల్లీలో తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని గురుగ్రామ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి శరద్ యాదవ్ అపస్మారస్థితిలోకి వెళ్లారు. పల్స్ లేకపోవడంతో సీపీఆర్ చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. రాత్రి… -
Covovax: బూస్టర్ డోస్గా “కోవోవాక్స్”.. కేంద్రం సిఫార్సు
Centre's Panel Recommends Market Clearance To Covovax As Covid Booster: కరోనా మహమ్మారిపై పోరులో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య దాదాపుగా తగ్గింది. ఇదిలా ఉంటే ప్రస్తుత చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్రం కోరుతోంది. -
Putin: “పుతిన్కు నెక్ట్స్ బర్త్ డే ఉండదు”.. వాళ్లే చంపుతారు.. రష్యా ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు..
Russian opposition leader's comments on Putin's murder: రష్యా ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన నెక్ట్స్ బర్త్ డే జరుపుకోడని..అతని అంతర్గత వ్యక్తులే అధ్యక్షుడిని చంపుతారని అన్నారు. హేగ్( అంతర్జాతీయ కోర్టు)లో పుతిన్ ను చూడటం తన వ్యక్తిగత కలళ అని దేశం నుంచి బహిష్కరించబడిని ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ అన్నారు. అయితే ఇది నెరవేరుతుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. -
SpiceJet Flight: ఢిల్లీ-పూణే స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు
Bomb threats to Spice Jet flight: ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు విమానాన్ని క్షణ్ణంగా సోదా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. బాంబు బెదిరింపులతో ప్రయాణికుల బోర్డింగ్ ను ఆపి బాంబు స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారు. -
Covid 19: వ్యాక్సిన్ కోసం చైనీయుల పాట్లు.. హాంకాంగ్కు పరుగులు..
Chinese Travellers Rushing To Hong Kong For mRNA Covid Vaccines: చైనాను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా చైనా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడం, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా అక్కడ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. రాజధాని బీజింగ్, షాంఘై ఇతర నగరాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ లేకుండా రోగులతో నిండిపోయాయి. -
West Bengal: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు..
Over Rs 10 crore in cash seized from TMC MLA Jakir Hossain's properties: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఏకంగా రూ. 10 కోట్ల నగదును ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జాకీర్ హుస్సెన్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. బుధవారం, గురువారాల్లో మొత్తం 28 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముర్షిదాబాద్లోని రఘునాథ్గంజ్,… -
UPI Payments: ఇక ఈ 10 దేశాల ఎన్ఆర్ఐలు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..
10 Countries Will Soon Let Non-Resident Indians Make UPI Payments: భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్లను సులభతరం చేసింది యూపీఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వీధిలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు పేమెంట్లు అన్నీ క్యాష్ లెస్ గా మారాయి. కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లావాదేవీలు చేయడానికి. ఇటీవల యూపీఐని విస్తృతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్పీసీఐ) కీలక నిర్ణయం… -
Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
Cylinder Blast: హర్యానాలో ఘోరం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరనించారు.పానిపట్ జిల్లా బిచ్పరి గ్రామ సమీపంలోని తహసీల్ క్యాంపు ప్రాంతంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయిన తర్వాత పేలుడు సంభవించి ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని మరణించారు. చనిపోయిన వారిలో దంపతులతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. -
Pak Embassy: మహిళా ప్రొఫెసర్తో పాక్ ఎంబసీ అసభ్య ప్రవర్తన.. భారత్కు వ్యతిరేకంగా రాయాలని డిమాండ్
Punjab woman accuses Pak embassy staff: పాకిస్తాన్ ఎంబసీ సిబ్బంది ఓ మహిళ ప్రొఫెసర్ తో అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక కోరికల గురించి అడుగుతూ తిక్క ప్రశ్నలు వేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించింది. తన వీసా అపాయింట్మెంట్ కోసం పాక్ ఎంబీసీ వెళ్లినప్పడు సీనియర్ సిబ్బంది తప్పుగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ కూడా రాశారు ఆమె. చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!