Nirmala Sitharaman: ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక వ్యాఖ్యలు
- భారత ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు..
- ట్రంప్ తీరుపై పరోక్షంగా విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్..
- ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
Nirmala Sitharaman: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వాణిజ్య ఆంక్షలు మరింత తీవ్రతరం కావడంతో భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించాడు. అలాగే, రష్యా నుంచి చమురు దిగుమతిని సాకుగా చూపించి భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిస్థితిపై ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ (IEC) 2025లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్లోబల్ ట్రేడ్ ఫెయిర్ గానీ, ఫ్రీ గానీ లేదు.. టారిఫ్లు, నాన్-టారిఫ్ అడ్డంకులు ఆర్థిక సాధనాలుగా కాకుండా వ్యూహాత్మక ఆయుధాలుగా మారిపోయాయి అని పేర్కొనింది. అయితే, భారత్ ఎప్పుడూ టారిఫ్లను ఆయుధాలుగా ఉపయోగించలేదు.. దేశీయ పరిశ్రమలు, ఉపాధిని కాపాడటమే మా లక్ష్యం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేసింది.
Read Also: CM Chandrababu Naidu: ఆ విషయంలో గ్రేట్! పవన్ కల్యాణ్ను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు..
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
అయితే, మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితుల్లో భారత్ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. టారిఫ్లు, ఇతర చర్యల ద్వారా వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ చర్చలు, రాజనీతితో ముందుకెళ్తుందని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 25 శాతం భారత్ నుంచే వచ్చేది.. అలాంటి స్థాయికి మళ్లీ చేరుకోవడమే మన టార్గెట్ కావాలని అన్నారు. ప్రస్తుత సవాళ్ల మధ్య భారత్ గ్లోబల్ వాణిజ్యంలో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నమోదు చేస్తుందన్నారు. బడ్జెట్ పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కేంద్రం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోందమని నిర్మలా సీతారామన్ వెల్లడించింది.
Watch Live: Smt @nsitharaman's keynote address at the @timesnetwork #IndiaEconomicConclave in New Delhi. #IEC2025 https://t.co/ja1mZWtPYQ
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) December 17, 2025
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!