Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
- 10 మంది మృతి
- 20 మందికి పైగా రోగులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం తెల్లవారుజామున బీహార్లోని ముజఫర్పూర్లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది రోగులు మరణించినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన పలువురు రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముజఫర్పూర్లోని బ్రహ్మపురలో ఉన్న ప్రసాద్ ఆసుపత్రిలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి , ఆసుపత్రి ప్రాంగణమంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఐదవ అంతస్తులోని ఐసీయూ వార్డులో ఈ మంటలు చెలరేగాయి. విషపూరిత పొగ వేగంగా ఆసుపత్రి మొత్తాన్ని కమ్మేసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో 20 మందికి పైగా రోగులు గాయపడగా, వారిని సురక్షితంగా తరలించారు. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగగా, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, దాదాపు డజను అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక బృందం మంటలను ఆర్పేసి రోగులను బయటకు సురక్షితంగా తరలించాయి.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
10 మంది మృతి
ఈ ఘటనను వివరిస్తూ అగ్నిమాపక అధికారి ఆర్.ఎన్. పాండే మాట్లాడుతూ, “తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి మాకు కాల్ వచ్చింది. మా బృందం అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసీయూ వార్డు మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది” అని అన్నారు. 20 మందికి పైగా రోగులను సురక్షితంగా రక్షించడం ఊరట కలిగించే విషయమని, అయితే 10 మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయని అధికారి తెలిపారు.
ఆసుపత్రి సిబ్బంది పారిపోయారని ఆరోపణలు
ఈ ఘటన అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఘటనా స్థలంలో ఉన్న రోగుల బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని ఆరోపించారు. బాధితుల్లో ఒకరు ఏడుస్తూ, తన తండ్రి ఐసీయూలో చేరారని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఘటన జరిగిన తర్వాత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందరూ రోగులను వదిలి అక్కడి నుంచి పారిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!