Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
- 10 మంది మృతి
- 20 మందికి పైగా రోగులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం తెల్లవారుజామున బీహార్లోని ముజఫర్పూర్లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది రోగులు మరణించినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన పలువురు రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముజఫర్పూర్లోని బ్రహ్మపురలో ఉన్న ప్రసాద్ ఆసుపత్రిలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి , ఆసుపత్రి ప్రాంగణమంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఐదవ అంతస్తులోని ఐసీయూ వార్డులో ఈ మంటలు చెలరేగాయి. విషపూరిత పొగ వేగంగా ఆసుపత్రి మొత్తాన్ని కమ్మేసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో 20 మందికి పైగా రోగులు గాయపడగా, వారిని సురక్షితంగా తరలించారు. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగగా, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, దాదాపు డజను అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక బృందం మంటలను ఆర్పేసి రోగులను బయటకు సురక్షితంగా తరలించాయి.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
- Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
10 మంది మృతి
ఈ ఘటనను వివరిస్తూ అగ్నిమాపక అధికారి ఆర్.ఎన్. పాండే మాట్లాడుతూ, “తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి మాకు కాల్ వచ్చింది. మా బృందం అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసీయూ వార్డు మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది” అని అన్నారు. 20 మందికి పైగా రోగులను సురక్షితంగా రక్షించడం ఊరట కలిగించే విషయమని, అయితే 10 మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయని అధికారి తెలిపారు.
ఆసుపత్రి సిబ్బంది పారిపోయారని ఆరోపణలు
ఈ ఘటన అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఘటనా స్థలంలో ఉన్న రోగుల బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని ఆరోపించారు. బాధితుల్లో ఒకరు ఏడుస్తూ, తన తండ్రి ఐసీయూలో చేరారని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఘటన జరిగిన తర్వాత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందరూ రోగులను వదిలి అక్కడి నుంచి పారిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..