సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE 2026), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ఎగ్జామినేషన్ 2026 కోసం అధికారికంగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. IAS లేదా IPS పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పుడు UPSC అధికారిక వెబ్సైట్ upsconline.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026 వరకు నమోదు చేసుకోవచ్చు. అయితే IFS అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్షగా […]
ఐదంకెల జీతాలు, వీకెండ్ పార్టీలు, ఫారిన్ ట్రిప్పులు సాఫ్ట్ వేర్ అనగానే గుర్తొచ్చేది ఇవే. కానీ, లోలోపల పని ఒత్తిడికి గురవుతూ క్షణ క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ బ్రతుకుతున్నవారెందరో. అందులో కొందరు ఒత్తిడిని జయిస్తుండగా మరికొందరు మాత్రం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో భార్యా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. […]
గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై […]
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) ఇటీవల భారత మార్కెట్లో డియో 125 X ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఇది డియో 125 సిరీస్లోని స్పెషల్ ఎడిషన్ వేరియంట్గా అట్రాక్ట్ చేస్తోంది. యువతను ఆకర్షించేలా బోల్డ్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, స్పోర్టీ లుక్తో ఈ స్కూటర్ వచ్చింది. సిటీ రైడింగ్కు పర్ఫెక్ట్గా సరిపోయే ఈ మోడల్ గురించి వివరంగా తెలుసుకుందాం. డియో 125 X ఎడిషన్ సాధారణ మోడల్ల కంటే చాలా స్పోర్టీగా, అగ్రెసివ్గా […]
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని ఫ్లై ఓవర్ పై బొలెరో వాహనం, బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నవీన్ తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందగా, జనగామ మండలం శామీర్ పేట కు చెందిన అభిలాష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభిలాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు వరంగల్ […]
హత్య కేసులో నిందితుడిగా ఉన్న దాదాపు 100 ఏళ్ల వృద్ధుడిని అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆ వ్యక్తి తన జీవిత ఖైదును సవాలు చేసి నాలుగు దశాబ్దాలకు పైగా గడిచిందని, అతను ఎదుర్కొన్న సామాజిక పరిణామాలను విస్మరించలేమని కోర్టు పేర్కొంది. జస్టిస్ చంద్ర ధారి సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఉపశమనం మంజూరు చేయడంలో అప్పీలులో సుదీర్ఘ జాప్యం, నిందితుడు ధామి రామ్ వయస్సు కారణాలుగా ఉన్నాయని పేర్కొంది. Also Read:Nizamabad: […]
మేడారం మహాజాతర ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కిటకిటలాడుతూ మేడారం జనసంద్రమైంది. ఈ జాతరలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన సమ్మక్క సారలమ్మ తల్లులకు భక్తులు కానుకలు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. Also Read:Lenin […]
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన హత్య ఘటనలో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు విధించింది. మరో నిందితుడికి రూ.2,000 జరిమానా విధించింది. భార్యపై అనుమానమే హత్యకు కారణమని జిల్లా కోర్టు నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటారు. […]
గురువారం జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి. స్మృతి మంధాన నేతృత్వంలోని RCB రెండోసారి టైటిల్ గెలుచుకోవడం ద్వారా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేయాలని చూస్తుండగా, ఫైనల్లో మూడుసార్లు ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో WPL కి కొత్త ఛాంపియన్ వస్తాడు లేదా చరిత్ర సమం అవుతుంది. ముఖ్యంగా, ఇద్దరు సన్నిహితులు, రెండు జట్ల కెప్టెన్లు, స్మృతి మంధాన, […]
బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. చాలా మంది గోల్డ్, సిల్వర్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఈ లోహాలపై మాత్రమే పెట్టుబడి పెట్టడం అవివేకమని ఎత్తి చూపారు. భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో, నిజమైన సంపద సృష్టికి మార్గం ప్రొడక్టివ్ అసెట్స్ ద్వారా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ద్వారా ఉంటుందని ఆయన అన్నారు. జియో బ్లాక్రాక్ చొరవ గురించి చర్చిస్తున్నప్పుడు, అంబానీ ఆశ్చర్యకరమైన గణాంకాలను […]