IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
- IBPS PO 2026 నోటిఫికేషన్ విడుదల
- 6,715 PO పోస్టులకు వెంటనే అప్లై చేయండి
- డిగ్రీ ఉంటే చాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2026-27 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్మెంట్ ట్రైనీ (MT-XVI) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,715 ఖాళీల భర్తీకి రిక్రూట్మెంట్ చేపట్టగా, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా జూలై 21, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: జూలై 1, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 21, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 21, 2026
Also Read
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
- ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
మొత్తం ఖాళీలు
ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్మెంట్ ట్రైనీ (MT): 6,715 పోస్టులు
జీతం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం అందిస్తారు.
విద్యార్హత
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయో సడలింపు
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
దివ్యాంగులకు (PwBD): 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు
SC/ST/PwBD అభ్యర్థులు: రూ.175
జనరల్/OBC/EWS అభ్యర్థులు: రూ.850
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
1. ప్రిలిమినరీ పరీక్ష
ప్రిలిమ్స్లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు.
పరీక్షలో వచ్చే అంశాలు:
ఇంగ్లీష్ లాంగ్వేజ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
రీజనింగ్ ఎబిలిటీ
ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపికవుతారు.
2. మెయిన్ పరీక్ష
మెయిన్ పరీక్షలో 170 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 160 నిమిషాలు.
3. ఇంటర్వ్యూ
మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు చేసిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింట్ కాపీని భద్రపరచుకోవడం మంచిది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ను ప్రారంభించాలని భావిస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!