Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలకు PTI గుడ్బై
- కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో జూలై 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు అనుకూల వాతావరణం ప్రస్తుతం లేదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రాంత రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఎన్నికల్లో పాల్గొనబోమన్న PTI
పార్టీ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ లాభనష్టాల ఆలోచన లేదని, కేవలం ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, కాశ్మీర్ ప్రజలకు మద్దతుగా నిలవడానికే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. ప్రజల హక్కులు పూర్తిస్థాయిలో పరిరక్షించబడే వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని PTI స్పష్టం చేసింది.
Also Read
భారీ నిరసనలే ప్రధాన కారణం
PoKలో కొంతకాలంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం, నిరసనలే ఈ బహిష్కరణకు ప్రధాన కారణంగా పార్టీ పేర్కొంది. నిషేధిత సంస్థ జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ఉద్యమాల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని తెలిపింది. ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, న్యాయమైన, శాంతియుత రాజకీయ వాతావరణం ఏర్పడే వరకు ఎన్నికల్లో పోటీ చేయడం సరైన నిర్ణయం కాదని పార్టీ అభిప్రాయపడింది. ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యం అక్కడి ప్రజల భద్రత, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణేనని వెల్లడించింది.
JAACపై నిషేధం.. పెరిగిన ఉద్రిక్తత
జూన్ 5న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టాల కింద JAAC సంస్థను నిషేధించింది. హింసాత్మక నిరసనల నేపథ్యంలో తీసుకున్న ఈ చర్య రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ పరిణామాల తర్వాతే ఎన్నికలను బహిష్కరించే దిశగా PTI నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
భయంతో కాదు.. ప్రజాస్వామ్యం కోసమే
తమ నిర్ణయం భయం లేదా బలహీనత కారణంగా తీసుకున్నది కాదని PTI మరోసారి స్పష్టం చేసింది. ప్రజల హక్కులను కాపాడేందుకు, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల నుంచి వైదొలగడంతో జూలై 27న జరగనున్న PoK అసెంబ్లీ ఎన్నికలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలు ఎలా సాగుతాయన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!