అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘంకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్సీఏను హైకోర్టు ఆదేశించింది. నార్త్ స్టాండ్స్కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. Also Read:Rain Alert: విశాఖకు వర్ష సూచన.. సింహాచలంలో వేగంగా దర్శనాలు తన […]
పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్య దాడికి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువునిచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని ‘లీవ్ ఇండియా’ నోటీసు నుంచి మినహాయించారు. స్వల్పకాలిక వీసాల 12 వర్గాలలో దేనినైనా కలిగి ఉన్న పాకిస్తానీయుల గడువు ఆదివారంతో ముగిసింది. Also […]
పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పాలిన ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు నిరంతరం ఒళ్లు బలుపు మాటలు, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున […]
అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు నేటి ధరలు ఊరట కలిగించాయి. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనాలనుకునే వారికి ఉపశమనం అనే చెప్పాలి. నేడు తులం బంగారం పై రూ. 60 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,791, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,975 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read:New Rules: మే 1 […]
నేటితో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. బ్యాంకింగ్, ఏటీఎం ఇలా పలు వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి నెలా మొదటి రోజున LPG గ్యాస్తో సహా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది సామాన్యుడి జేబుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. రేపటి నంచి ఏయే మార్పులు చోటుచేసుకోనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Pawan Kalyan: సింహాచలం ఘటన […]
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని.. సంపద పెరుగుతుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా లక్షను తాకింది. దీంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ, […]
వైశాఖ శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అంటారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు వారి వారి రాశిచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉంటారు. కాబట్టి సూర్య చంద్రుల ఆశీర్వాదాల ఫలం శాశ్వతంగా ఉంటుంది. అక్షయ అంటే క్షయం కానిది అని అర్థం. ఈ రోజు చేసిన పని, ధాన ధర్మాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులను కొనుగోలు చేసి, చాలా వస్తువులను దానం చేస్తారు. ముఖ్యంగా బంగారాన్ని కొని ఇంటికి […]
ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు జీవితాలను తలకిందులు చేస్తాయి. 9 నెలల క్రితం పెళ్లైన ఓ యువతి లైఫ్ లో అనుకోకుండా జరిగిన సంఘటన జీవితమే లేకుండా చేసింది. పెళ్లై ఏడాది గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బైక్ పై వెళ్తుండగా మెడకు ఉన్న చున్ని వెనక చక్రంలో చిక్కుకోవడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అనకాపల్లిలో జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. ధీటుగా ఎదుర్కొంటామన్న పాక్ మంత్రి పూర్తి […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా ఢిల్లీ, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో, కోల్కతా ఢిల్లీని 14 పరుగుల తేడాతో ఓడించింది. ఢిల్లీపై కోల్కతా ఉత్కంఠ విజయం సాధించింది. కోల్కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన KKR 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన […]
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. “జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్ఠత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు” అని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. Also […]