ఆర్థిక రాజధాని ముంబైలోని ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబై ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామంటూ అగంతకులు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముంబై విమానాశ్రయాన్ని పేల్చివేస్తాము అని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మూడు గంటల పాటు ఎయిర్పోర్ట్ను తనిఖీ చేశారు. బాంబు గుర్తింపు బృందాలు, ఇతర భద్రతా సంస్థలు విమానాశ్రయంలో హై అలర్ట్లో ఉన్నాయి. MIDC పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి వేగంగా […]
అవకాశం వచ్చినప్పుడే ఒడిసిపట్టుకోవాలి. మళ్లీ మళ్లీ అదృష్టం తలుపు తట్టదు కదా. మీ లైఫ్ సెట్ చేసుకోవడానికి కూడా ఇదే గోల్డెన్ ఛాన్స్. మంచి జాబ్ సాధించి లైఫ్ లో స్థిరపడాలనుకుంటే ఈ బ్యాంక్ జాబ్స్ ను అస్సలు వదలకండి. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ […]
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆయన రూ.77 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఐదు నగరాల్లో నాలుగు రోడ్ షోలు, మూడు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. దీనితో పాటు, ‘మేక్ ఇన్ ఇండియా’ కింద, దాహోద్లో రూ. 21 వేల కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన రైల్వే ఉత్పత్తి యూనిట్ను ఆయన ప్రారంభించారు. Also Read:HPSL […]
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలోని తిరువాన్మియూర్లో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనే సెమినార్కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సెమినార్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు.. తమిళనాడు సిద్ధుల భూమి. తమిళ దేవుడు మురుగన్ భూమి.. నేను తమిళనాడులో నివసించాను.. నేను చెన్నైలో పెరిగాను.. నేను తమిళనాడు వదిలి వెళ్ళిపోయినా, తమిళనాడు నన్ను వదిలి వెళ్ళలేదు అని అన్నారు. Also Read:Kakani […]
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య […]
అసిమ్ మునీర్ భారత్ పై విషం కక్కుతూ పహల్గాం ఉగ్ర ఘటనకు కారణమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. కాగా ఫీల్డ్ మార్షల్గా ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదివారం ఉన్నత స్థాయి విందు ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నుంచి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో వరకు, రాజకీయ, సైన్యం నుంచి అనేక మంది ఉన్నతాధికారులు విందులో […]
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్లోని మరో ముగ్గురు సభ్యులు అంతరిక్ష ప్రయాణానికి ముందు క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ సమాచారాన్ని అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఆక్సియం స్పేస్ వెల్లడించింది. సిబ్బంది ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడమే క్వారంటైన్ ఉద్దేశ్యం. ఇది అంతరిక్ష కార్యకలాపాల భద్రత, విజయాన్ని నిర్ధారించే ప్రామాణిక ప్రక్రియ. ఆక్సియం-4 మిషన్ ద్వారా వ్యోమగాములు జూన్ 8న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ […]
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు, ఆమె తండ్రి, మామ బ్యాంకు ఖాతా వివరాలపై ఆరా తీశారు. జ్యోతి పీఎన్బీ ఖాతాలో పోలీసులు ఎటువంటి భారీ లావాదేవీలను గుర్తించలేదు. జ్యోతికి ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఏ ఖాతాలోకి వచ్చిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జ్యోతి పాత పీఎన్బీ ఖాతా వివరాలను పోలీసులు పరిశీలించగా, వారికి […]
ప్రధానమంత్రి మోడీ నేడు, రేపు గుజరాత్లో పర్యటించనున్నారు. స్వరాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్లో రూ.77,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ప్రధాని గుజరాత్ కు వస్తుండటంతో భారీగా స్వాగత ఏర్పాట్లు చేసింది బిజెపి. మోడీ దాహోద్లోని లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని దేశానికి అంకితం చేయనున్నారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. Also Read:Tragedy : చర్లపల్లి రైల్వే స్టేషన్లో విషాదం.. అత్తగారి ఇంటికి వెళ్తూ […]
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో కఠినమైన సుంకాల విధానాన్ని ప్రకటించారు. అనేక దేశాలతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా వెలుపల ఐఫోన్లను తయారు చేస్తే 25 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ ఆపిల్ను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కొత్త ప్రకటన వెలువడింది. దేశీయంగా యుద్ధ ట్యాంకులు, సాంకేతిక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే తన టారిఫ్ విధానం అని ఆయన స్పష్టంగా […]