ఇవాళ రాజమండ్రిలో మీడియా ముందుకు జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. థియేటర్ల బంద్ కు సూత్రధారి అత్తి సత్యనారాయణ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన వివరణ ఇచ్చారు. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. దురుద్దేశంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని అన్నారు. Also […]
ఎలక్ట్రిక్ బైక్ లకు ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో కేటీఎం చేరబోతోంది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల, కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ స్ట్రీట్ఫైటర్ బైక్ KTM E-డ్యూక్ నమూనాను ప్రదర్శించింది. KTM E-డ్యూక్లో 5.5kWh బ్యాటరీ ప్యాక్ అందించనున్నారు. ఇది 10kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, […]
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. పాకిస్తాన్పై భారత్ తీసుకున్న చర్య గురించి చర్చతో పాటు, ఈ ఆపరేషన్ లోగో రూపకల్పన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ లోగో ఎవరు రూపొందించి ఉంటారబ్బా అని సెర్చ్ చేయడం ప్రారంభించారు. Also Read:Bhatti Vikramarka: స్వామి ఆశీస్సులతోనే […]
తమిళనాడు అధికార డిఎంకెతో ఎన్నికల ఒప్పందం తర్వాత మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు స్థానాలకు ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరుగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తన మక్కల్ నీది మయ్యం పార్టీ డిఎంకె నేతృత్వంలోని కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కమల్ హాసన్కు ఒక లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదా ఎన్నికల తర్వాత […]
ఇంకొన్ని రోజుల్లో ఈ ఏడాది మే నెల కాలగర్భంలో కలిసిపోయి జూన్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే ఈ వచ్చే నెలలో కూడా భారీగా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించింది. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు, పండగలు పురస్కరించుకుని మొత్తం 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. అంటే జూన్ లో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ ప్రకటించిన ఈ […]
టెక్నాలజీ అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐతో వినూత్న ఆవిష్కరణలు ఉద్భవిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా రెండు రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో రోబోలు ఒకరినొకరు తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పంచ్ల వర్షం కురిపించుకున్నారు. అచ్చం మానవ బాక్సింగ్ పోటీల మాదిరిగానే జరిగాయి. ఈ 4.25 అడుగుల పొడవైన రోబోల పోటీని టీవీలో కూడా ప్రసారం చేశారు. Also Read:U16 Davis Cup: ఓడినా సిగ్గు లేదుగా.. ఓవర్ యాక్షన్ చేసిన […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను తాను ప్రతిపాదించిన $175 బిలియన్ల ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ షరతు విధించారు. “వారు ఒక ప్రత్యేక దేశంగా ఉంటే వారికి $61 బిలియన్లు ఖర్చవుతుందని నేను కెనడాకు చెప్పాను, కానీ వారు అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే వారికి సున్నా డాలర్లు ఖర్చవుతాయి” అని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు. […]
విదేశీ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సోషల్ మీడియా ఖాతాలపై లోతైన దర్యాప్తును తప్పనిసరి చేసే ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకుంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంతకం చేసిన పత్రాలను ఉటంకిస్తూ పొలిటికో ఈ సమాచారాన్ని అందించింది. ఈ చర్య విద్యార్థుల వీసా ప్రక్రియపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని, ఆర్థికంగా నిలకడగా ఉండటానికి విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఎక్కువగా ఆధారపడే అనేక US విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తుందని నివేదిక పేర్కొంది. జాతీయ […]
తమిళనాడులోని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న విజీపీ అమ్యూజ్మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఎనిమిది మంది పిల్లలు, పది మంది మహిళలు సహా ముప్పై మంది దాదాపు మూడు గంటల పాటు 70 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు పర్యాటకులు. పైకి వెళ్ళిన రోలర్ తిరిగి కిందకు వచ్చే సమయంలో సాంకేతికత లోపం కారణంగా ఆగిపోయింది. […]
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, బహిష్కృత పాకిస్తాన్ నాయకుడు, ముత్తహిదా క్వామీ ఉద్యమం (MQM) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి సహాయం కోరాడు. ఉర్దూ మాట్లాడే శరణార్థులు, అంటే దేశ విభజన తర్వాత భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్లో స్థిరపడిన ముహాజీర్లను హింసించే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు. లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ […]