Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ.. వెలుగులోకి కీలక విషయాలు
- జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ
- పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాలకు ప్రయాణించి అక్కడి ఖరీదైన హోటళ్లలో బస చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు, ఆమె తండ్రి, మామ బ్యాంకు ఖాతా వివరాలపై ఆరా తీశారు. జ్యోతి పీఎన్బీ ఖాతాలో పోలీసులు ఎటువంటి భారీ లావాదేవీలను గుర్తించలేదు. జ్యోతికి ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఏ ఖాతాలోకి వచ్చిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జ్యోతి పాత పీఎన్బీ ఖాతా వివరాలను పోలీసులు పరిశీలించగా, వారికి పెద్దగా ఏమీ దొరకలేదు.
Also Read:Mahesh Babu : మహేష్-రాజమౌళి సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ ?
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
జ్యోతి 2011-2012 సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలో తన ఖాతాను తెరిచింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 2024 వరకు, ఖాతాలో లావాదేవీలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు మూడు సంవత్సరాల లావాదేవీలను పోలీసులు దర్యాప్తు చేశారు. గత మూడేళ్లలో ఖాతాలో ఎటువంటి పెద్ద లావాదేవీ జరగలేదని వెల్లడైంది. ఖాతా ఇనాక్టివ్ గా మారింది. దీంతో జ్యోతి ఖాతాను మూసివేయడానికి బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత సంవత్సర కాలంగా జ్యోతి బ్యాంకు ఖాతాలో రూ. 10 కంటే తక్కువ డబ్బు ఉంది. ఖాతాలో నిర్దేశించిన కనీస మొత్తం కంటే తక్కువ ఉన్నప్పుడు, నిందితురాలు జ్యోతి మల్హోత్రా అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:AP Rains: నేడు రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
ఆమె పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాలకు ప్రయాణించి అక్కడి ఖరీదైన హోటళ్లలో బస చేసింది. ఇదే కాకుండా ఆమె దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించింది. నిందితురాలు జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా తన ఆదాయం కంటే ఎక్కువ డబ్బు సంపాదించేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు పీఎన్బీ బ్యాంకుకు చేరుకునే ముందు, వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జ్యోతికి సంబంధించిన ఖాతాల వివరాలను కూడా సేకరించారు. ఆ ఖాతాలు జ్యోతికి చెందినవా లేదా ఆమె బంధువులకు చెందినవా అనే దాని గురించి పోలీసులు, బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!