ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్లు) సృష్టించడానికి రూల్స్ ను మార్చింది. కొత్త UAN నంబర్ను సృష్టించడానికి ఇప్పుడు UMANG యాప్ అవసరం అవుతుంది. ఈ నియమం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో పాటు, UAN జనరేషన్, యాక్టివేషన్ ప్రక్రియను సరళంగా, సురక్షితంగా చేయడానికి EPFO UMANG యాప్ నుండి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని తప్పనిసరి చేసింది. అధికారిక సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు అన్ని కొత్త UAN […]
వాట్సాప్ లో మెసేజ్ పంపడానికి ఒకరి నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు.. అవతలి వ్యక్తికి WhatsApp యాప్ లేదని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ మెసేజ్ లేదా కాల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కానుంది. WhatsApp లేని వారికి కూడా మీరు సందేశం పంపగలిగే ఫీచర్పై WhatsApp పనిచేస్తోంది. WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్ను ‘గెస్ట్ చాట్’ అని పిలుస్తారు. వాట్సాప్ నెట్వర్క్ వెలుపల ఉన్న ఇతర వ్యక్తులతో చాట్ చేయాలనుకునే వినియోగదారులకు […]
భారత సైన్యం ఒక పాత వార్తాపత్రిక నివేదికను పోస్ట్ చేయడం ద్వారా అమెరికా తన చారిత్రక చర్యను గుర్తు చేసింది. ఈ పోస్ట్ ఆగస్టు 5, 1971 నాటిది. భారతదేశంతో యుద్ధానికి ముందు దశాబ్దాలుగా అమెరికా పాకిస్తాన్కు ఎలా సహాయం చేసిందో ఇది నివేదిస్తుంది. పాకిస్తాన్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారతదేశం నుంచి దిగుమతులపై సుంకాన్ని పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన తర్వాత భారత సైన్యం అమెరికాకు ధీటుగా జవాబిచ్చింది. వార్తాపత్రిక […]
ఇటీవలికాలంలో ఎక్కువగా సేల్ అవుతున్న బైక్ టీవీఎస్ రైడర్ 125. కుర్రాళ్లు ఈ బైక్ ను కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బడ్జెట్ ధరలోనే రావడం, స్మార్ట్ ఫీచర్లు ఉండడంతో క్రేజ్ పెరిగింది. తాజాగా టీవీఎస్ కంపెనీ బైక్ లవర్స్ కు షాకిచ్చింది. TVS, దాని పాపులర్ కమ్యూటర్ బైక్ TVS రైడర్ 125 ధరను పెంచింది. దీని ధరను రూ. 365 పెంచింది. స్వల్ప పెరుగుదలనే కాబట్టి వర్రీ కావాల్సిందేమీ లేదు. ఇదే సమయంలో ఈ […]
మరో మూడు రోజుల్లో రాఖీ పండుగ రాబోతోంది. అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా రక్షబంధన్ నిలుస్తోంది. ఈ ఏడాది కూడా రాఖీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ మరోసారి ఆయన కోసం రాఖీని సిద్ధం చేశారు. పాకిస్తాన్లోని కరాచీలో జన్మించిన ఖమర్ షేక్ గత 30 సంవత్సరాలుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్నారు. […]
రష్యాలోని సోచి నగరంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా కాలిపోతున్న రోస్నెఫ్ట్-కుబన్నెఫ్టెప్రొడక్ట్ ఆయిల్ డిపో ముందు టిక్టాక్ వీడియో చిత్రీకరించిన ఇద్దరు యువ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్లు డార్య వ్లాదిమిరోవ్నా లోస్కుటోవా (21), కరీనా ఎవ్గెన్యేవ్నా ఓషుర్కోవా (20)లను రష్యన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 3, 2025న జరిగింది. ఈ వీడియోలో వారితో పాటు ఒక గుర్తు తెలియని వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ వీడియో రష్యన్ ర్యాపర్ ఎండ్ష్పిల్ “క్రిమ్సన్ డాన్” పాటకు […]
కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఎంజీ మోటార్ దేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ రెండు SUV లపై లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎంజీ హెక్టార్, ఆస్టర్ లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. కంపెనీ MG హెక్టర్ పై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీనిని మిడ్-సైజ్ SUV గా అందిస్తున్నారు. ఈ నెలలో, […]
రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) తూర్పు రైల్వే (ER)లో అప్రెంటిస్షిప్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,115 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి NCVT/SCVTకి సంబంధించిన ట్రేడ్లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. Also Read:Chiranjeevi: […]
ఇండియన్ నేవీ SSC ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ నేవీలో SSC ఎగ్జిక్యూటివ్గా పనిచేయాలనుకునే అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుతో కనీసం 60% మార్కులు పొంది ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి (కంప్యూటర్ […]
కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా అని అన్నారు. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని.. కుంకీలు దారి మళ్లించాయి.. తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి […]