CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తీసుకున్న నూతన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి అంశంలోనూ చట్టం ప్రకారమే పాలన సాగిస్తూ, ప్రజలకు సంపూర్ణ జవాబుదారీతనంతో సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆహార పదార్థాలు, నిత్యవసర ఔషధాల నాణ్యతను, భద్రతను పర్యవేక్షించేందుకు ఏకీకృత వ్యవస్థగా ‘తెలంగాణ సేఫ్’ (TG-Safe – తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) ను అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ నూతన అథారిటీ ద్వారా కఠిన ప్రమాణాలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు.
Also Read
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
Our People’s Government has placed a premium on safety, security and well-being of citizens in every aspect of life.
Establishing and reiterating rule of law and making accountability our deepest commitment.
Today, as Telangana Standards Authority for Food and Essential Drugs…
— Revanth Reddy (@revanth_anumula) August 17, 2026
దీని ద్వారా మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడం, నకిలీ , ప్రమాదకర మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు పెరిగి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా పౌరులకు సురక్షితమైన ఆహారం, సమర్థవంతమైన మందులు అందుబాటులోకి వచ్చి, ప్రజారోగ్యానికి సంపూర్ణ భద్రత చేకూరుతుంది.
నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మందులు అందించడమే లక్ష్యంగా పనిచేసే ‘TG-Safe’ సేవలను ఉపయోగించుకుంటూ, ఆరోగ్యవంతమైన, సురక్షితమైన తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర పౌరులందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్ల వెనుక అసలు కథ ఇదే!
-
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!