ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని యుద్ధాలు సద్దుమణిగాయి. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం 4 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది.
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టింది. తొలిసారి తిరువనంతపురం మేయర్ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత వీవీ.రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు.
ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లోని బంగ్లాలో 19 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లాలూ కుటుంబానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఖాళీ చేసేందుకు నిరాకరించింది. ముఖ్యమంత్రులుగా పని చేసిన తమకు బంగ్లాను […]
భూమ్మీద నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదమైనా బయటపడతారని పెద్దలు అంటుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లోని సూరత్లో చోటుచేసుకుంది. 10వ అంతస్తు నుంచి జారి పడ్డ ఒక వ్యక్తి.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అసలేం జరిగింది.. ఎలా పడిపోయాడో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార పార్టీకి చాలా కీలకం. అదే తరుణంలో శివసేన (యూబీటీ)కి కూడా అంతే ప్రాధాన్యం. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయ నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం మంచి జోష్లో ఉంది. ముంబైను కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టిపీడిస్తోంది. గత కొద్దిరోజులుగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన గాలి లేక ప్రజలు నానా యాతన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా హంతకుల్లో మార్పు రావడం లేదు. కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన భాగస్వాములను అత్యంత దారుణంగా కడతేర్చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో చోటుచేసుకుంది. ఖుష్బూ, అర్జున్ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. లూథియానాలో కూలీగా పని చేస్తున్న అర్జున్ డిసెంబర్ 21న గోరఖ్పూర్కు వచ్చాడు. అయితే భార్య ఖుష్బూ రహస్యంగా మొబైల్ ఫోన్ వాడడం చూసి నిర్ఘంతపోయాడు. భర్త రాగానే ఫోన్ను రహస్యంగా దాచిపెట్టేసింది. దీంతో అదే […]
వామ్మో.. సిల్వర్కు ఏమైంది? ఈ ఏడాది వెండి మెరుపులు సృష్టిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం వరకు కిలో వెండి లక్ష రూపాయుల కంటే తక్కువగా ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. జెట్ స్పీడ్లో ధరలు దూసుకుపోయాయి.
రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్-అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మధ్య జరిగిన ‘పాకిస్థాన్ అణ్వాయుధ’ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్స్క్రిప్ట్లను నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అణ్వాయుధాలపై ఇరువురి నేతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేసినట్లుగా పత్రాల్లో వెల్లడయ్యాయి.
కెనడాలో మరో ఘోరం జరిగింది. ఇటీవల టొరంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్య ఘటన మరువక ముందే మరో భారతీయ విద్యార్థి శివంక్ అవస్థి (20) హత్యకు గురయ్యాడు. దీంతో భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.