Thailand-Cambodia war: థాయ్లాండ్-కంబోడియా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం.. ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్
- థాయ్లాండ్-కంబోడియా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
- 20 రోజుల ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్
థాయ్లాండ్-కంబోడియా మధ్య మరోసారి శాంతి ఒప్పందం జరిగింది. గత 20 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పడింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆయుధాలు వాడకంపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఇరు దేశాల రక్షణమంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది.
ఇది కూడా చదవండి: Ukraine: ట్రంప్తో జెలెన్స్కీ భేటీకి ముందు కీవ్లో భారీ పేలుళ్లు.. మళ్లీ ఉత్కంఠ
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
థాయ్లాండ్-కంబోడియా మధ్య చాలా రోజులుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. అయితే ట్రంప్ రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించి కాల్పుల విరమణ చేయించారు. రెండు దేశాల అధ్యక్షులు ట్రంప్ సమక్షంలో సంతకాలు కూడా చేశారు. కానీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఈనెల ప్రారంభంలో మరోసారి ఇరు దేశాలు దాడులకు దిగాయి. వైమానిక దాడులతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి 20 రోజుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ సునామీ.. ఈరోజు భారీగా పెరిగిన వెండి ధర
ఇదిలా ఉంటే ఇటీవల కంబోడియా సరిహద్దులో ఉన్న విష్ణువు విగ్రహాన్ని థాయ్లాండ్ కూల్చేసింది. ఈ ఘటనపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి అగౌరవకరమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచరుల మనోభావాలను దెబ్బతీస్తాయని.. ఇలా జరగకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
అయితే భారత్ అభ్యంతరంపై థాయ్లాండ్ స్పందించింది. భద్రత కోసమే విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేశామని.. అంతేతప్ప హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి కాదని థాయ్లాండ్ స్పష్టం చేసింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో కావాలనే కంబోడియా సైనికులు విగ్రహాన్ని నిర్మించారని.. ఆ ప్రాంతం తమదేనని అందుకోసమే భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కూల్చేసినట్లుగా వెల్లడించింది. వాస్తవంగా ఆ ప్రాంతం మతపరమైన ప్రాంతం కూడా కాదని.. ఉద్దేశపూర్వకంగా కంబోడియా సైనికులు నిర్మించారని పేర్కొంది. తాజాగా రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకోవడం పరిస్థితులు చల్లబడ్డాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో