Thailand-Cambodia war: థాయ్లాండ్-కంబోడియా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం.. ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్
- థాయ్లాండ్-కంబోడియా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
- 20 రోజుల ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్లాండ్-కంబోడియా మధ్య మరోసారి శాంతి ఒప్పందం జరిగింది. గత 20 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పడింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆయుధాలు వాడకంపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఇరు దేశాల రక్షణమంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది.
ఇది కూడా చదవండి: Ukraine: ట్రంప్తో జెలెన్స్కీ భేటీకి ముందు కీవ్లో భారీ పేలుళ్లు.. మళ్లీ ఉత్కంఠ
Also Read
- Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్లో పర్యటన!
- Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
- Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
థాయ్లాండ్-కంబోడియా మధ్య చాలా రోజులుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. అయితే ట్రంప్ రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించి కాల్పుల విరమణ చేయించారు. రెండు దేశాల అధ్యక్షులు ట్రంప్ సమక్షంలో సంతకాలు కూడా చేశారు. కానీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఈనెల ప్రారంభంలో మరోసారి ఇరు దేశాలు దాడులకు దిగాయి. వైమానిక దాడులతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి 20 రోజుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ సునామీ.. ఈరోజు భారీగా పెరిగిన వెండి ధర
ఇదిలా ఉంటే ఇటీవల కంబోడియా సరిహద్దులో ఉన్న విష్ణువు విగ్రహాన్ని థాయ్లాండ్ కూల్చేసింది. ఈ ఘటనపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి అగౌరవకరమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచరుల మనోభావాలను దెబ్బతీస్తాయని.. ఇలా జరగకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
అయితే భారత్ అభ్యంతరంపై థాయ్లాండ్ స్పందించింది. భద్రత కోసమే విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేశామని.. అంతేతప్ప హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి కాదని థాయ్లాండ్ స్పష్టం చేసింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో కావాలనే కంబోడియా సైనికులు విగ్రహాన్ని నిర్మించారని.. ఆ ప్రాంతం తమదేనని అందుకోసమే భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కూల్చేసినట్లుగా వెల్లడించింది. వాస్తవంగా ఆ ప్రాంతం మతపరమైన ప్రాంతం కూడా కాదని.. ఉద్దేశపూర్వకంగా కంబోడియా సైనికులు నిర్మించారని పేర్కొంది. తాజాగా రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకోవడం పరిస్థితులు చల్లబడ్డాయి.
తాజావార్తలు
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!