2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు.. దావోస్ వేదిక గా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు... రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు..
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు లోకేష్.. బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు లోకేష్కి శుభాకాంక్షలు తెలిపుతున్నారు..
ఇన్నాళ్ళు స్తబ్దుగా మారిన పార్టీ వాతావరణం తిరిగి సెట్ అవుతోందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలి కాలంలో జిల్లా సమీక్షా సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారట జగన్. సీనియర్స్ అంతా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పాలన్న ఆదేశాలు మెల్లిగా అమలవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మహేష్ గౌడ్ను గత సెప్టెంబర్లో నియమించింది పార్టీ అధిష్టానం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు... అంతా ఏక్ నిరంజన్ అన్నట్టుగానే ఉంది తప్ప... కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ... ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గాన్ని నియమించకుండా ఉండలేదన్న చర్చ జరుగుతోంది గాంధీభవన్ వర్గాల్లో. గతంలో రేవంత్రెడ్డిని పీసీసీ చీఫ్గా ప్రకటించిన సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు , ప్రధాన కార్యదర్శులు, ప్రచార కమిటీ చైర్మన్ను కూడా ఒకేసారి అనౌన్స్…
ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో నకిలీ జడ్జిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద సకిలీ జడ్జి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల చిరునామాలతో అతని దగ్గర కార్డులు ఉండడాన్ని గుర్తించారు పోలీసులు..
కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు .