ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నారు.. 2021-22లో వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించనున్నారు.. ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని క్రమంగా భర్తీ చేయనున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని పలు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.. మొత్తంగా […]
కరోనా మహమ్మారి చాలా దేశాల కంటిపై కునుకు లేకుండా చేసింది.. ఏ దేశంలో గణాంకాలు పరిశీలించిన.. భారీగా కేసులు, పెద్ద సంఖ్యలో మృతుల సంఖ్య కలవరపెట్టింది.. ఇక, ఫ్రాన్స్ను కూడా అతలాకుతలం చేసింది కోవిడ్.. అయితే, ఇప్పుడు క్రమంగా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.. కేసులు తగ్గిపోయాయి.. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా పుంజుకుంది… దీంతో.. కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్.. ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు, ఇకపై బహిరంగ […]
సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు.. మీడియాకు ఎక్కిన ఓ వార్త గురించి క్లారిటీ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్ఫాం టికెట్తోనే రైల్లో ప్రయాణించే అవకాశం లేదని స్పష్టం చేసింది.. అసలు ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్టు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.. ప్లాట్ఫాం టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్వో టీటీఈ దగ్గరకు వెళ్లి టికెట్ తీసుకునే అవకాశం లేదని వివరణ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే.. కాగా, ప్లాట్ఫాం టికెట్ తీసుకున్న […]
టీవీ ఛానెళ్ల ప్రసారాల్లో ఇప్పటికీ ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. అయితే, పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్రం పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఈ మేరకు […]
ఐటీ కంపెనీల్లో ఉద్యోగం అంటే నేటి యువతకు మక్కువ ఎక్కువ.. వర్క్ టెన్షన్ సంగతి ఎలా ఉన్న.. మంచి వేతలనాలు ఉండడంతో.. క్రమంగా యూత్ అటు మొగ్గు చూపుతుంది.. అయితే, టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్వేర్ సంస్థలు వేగంగా ఆటోమేషన్కు మారుతున్నాయి.. దేశీయ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. దీంతో.. పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత పడనుంది తన నివేదికలో పేర్కొంది బ్యాంక్ ఆఫ్ అమెరికా.. ప్రస్తుత […]
ఓవైపు కరోనా మహమ్మారి.. మరో వైపు లాక్డౌన్లు, కర్ఫ్యూల నేపథ్యంలో.. వాహనదారులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం.. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది.. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును గతంలో ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన కేంద్రం.. ఇవాళ వ్యాలిడిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు మరియు రవాణా, రహదారుల […]