ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా […]
మేషం : ఈ రాశివారు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకంటారు. వృషభం : ఈ రోజు మీపై ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథునం : ఈ రోజు ఈ […]
భారత్లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది.. మాల్యా దివాలా తీసినట్టు ప్రకటించింది లండన్ కోర్టు… మాల్యా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దానికి అనుమతి నిరాకరించారు. అయితే, మాల్యా ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మాల్యా దివాళా తీసినట్లు తీర్పు ఇస్తున్నాను అంటూ జడ్జి మైఖేల్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు.. ఇక మాల్యాను భారత్కు అప్పగించేందుకు సంబంధించిన […]
ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి […]
యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011 […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ… […]
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీకి బైబై చెప్పిన తర్వాత.. ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో… తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు.. బీజేపీలో పరిస్థితిలు నాకు నచ్చలేదన్న పెద్దిరెడ్డి… కానీ, ఆ పరిణామాలపై విమర్శలు చేయదల్చుకోలేదన్నారు.. అయితే, ఈటల రాజేందర్.. బీజేపీలో చేరిన విషయంలో నాకు గౌరవం ఇవ్వలేదని కామెంట్ చేశారు.. ఇక, […]
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,14,105 శాంపిల్స్ పరీక్షించగా.. 638 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 715 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,791కి పెరగగా.. రికవరీ కేసులు 6,28,679కు చేరాయి.. ఇక, ఇప్పటి […]
కట్టెలు ఎత్తిన చేతులతోనే భారత్కు వెండి పతకాన్ని సాధించి పెట్టారు వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించి.. భారత్ పతకాల ఖాతా తెరిచారామె.. ఇక, ఆమెకు బంగారం పతకం కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి.. కానీ, బంగారు పతకాన్ని అందుకున్న చైనీ క్రీడాకారిణి డోపింగ్ టెస్ట్లో విఫలం అయితేనే అదిసాధ్యం అవుతుంది. మరోవైపు.. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్న చానుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది.. ఇక, ఇటీవల ఆమెకు కోటి రూపాయల […]
టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి.. భారత్ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్లో చైనా వెయిట్లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ […]