తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ… ఆ డీపీఆర్లు ఇవ్వండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ… ప్రస్తుతం తమ వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని లేఖలు రాస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబికి రాసిన లేఖలో వాటాల ప్రస్తావనే వివాదాస్పదంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 4 లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం ఇప్పటికే మినిమం డ్రా డౌన్ లెవల్ దాటి పోయింది. 863.70అడుగుల నీటి వద్ద, జలాశయంలో 117.77 టిఎం సిల నీరునిలువ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎపి ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి 27 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు బోర్డును అనుమతి కోరింది. ఈ నీటిలో చెన్నై నగర తాగునీటి అవసరాలకు 3 టిఎంసిలు, తెలుగుగంగ కాలువకు 7 టిఎంసిలు, శ్రీశైలం కుడిగట్టుకాలువ పథకం, గాలేరు నగరి పథకానికి కలిపి 8టిఎంసిలు, హంద్రీనీవా పథకానికి 7 టిఎంసిలు, కర్నూలు-కడప కాలువకు 2 టీఎంసీలు అవసరం అని లేఖ ద్వారా కృష్ణా రివర్ బోర్డుకు వివరించింది. అయితే తెలంగాణ రాష్ట్రం వినియోగించుకున్న నీటి లెక్కల ప్రస్తానే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాలను ఇప్పటివరకు వాడుకుందని ఎపి తన లేఖ ద్వారా బోర్డుకు తెలిపింది. అంతేకాకుండా ఎపికి 66 శాతం, తెలంగాణకు 34 శాతం దామాషా పద్ధతిలో … తమకు కూడా 160టిఎంసిల నీటిని వాడుకునే హక్కు కల్పించాలని బోర్డుకు లేఖద్వారా తెలిపింది ఏపీ సర్కార్.. దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కేఆర్ఎంబీయే… తెలంగాణ సర్కార్కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?