ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు పోటీపడి లేఖలు రాస్తూ వస్తున్నాయి రెండు రాష్ట్రాలు.. తాజాగా, కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ సారి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విషయాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసిన తెలంగాణ […]
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్స్ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు […]
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు.. పాదయాత్ర, దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, నిరుద్యోగ సమస్యను పోరాట ఆయుధంగా తీసుకున్న వైఎస్ షర్మిల.. ప్రతీ మంగళవారం ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు.. ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించడం.. ఆ తర్వాత ఒక్కరోజు దీక్ష చేసి.. […]
ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్యా ముండా జయంతి సందర్భంగా.. ఆయన జన్మస్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రలు అర్జున్ ముండా, జి. కిషన్ రెడ్డి.. బిర్సా ముండా అనుచరులను సన్మానించారు.. ఝార్ఖండ్లోని బిర్సా ముండా జన్మస్థలం ఖుంటి జిల్లాలోని ఉలిహటు గ్రామంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలు నిర్వమించారు.. ఈ సందర్భంగా ఆయన అనుచరుల పాదాలను కడిగి.. సన్మానించారు అర్జున్ ముండా, జి కిషన్ రెడ్డి.. కాగా, 1875లో జన్మించిన బిర్సా ముండా.. 1900లో కన్నుమూశారు.. అటవీ జాతుల […]
చిన్నా చితక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్లుగా సేవలు అందించినవారు కూడా ఎంతో మంది ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టారు.. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినవారు చాలా మందే ఉన్నారు.. కొత్త ఇన్నింగ్స్లో చక్రం తిప్పినవారు కూడా ఉన్నారు.. కొందరు ఇప్పటికీ ప్రభుత్వాల్లో కీలకంగా పనిచేస్తుండగా.. మరికొందరు మొదట్లో కాస్త హడావిడి చేసినా.. రాజకీయరంగంలో రాణించలేక సైలెంట్గా ఉన్నవారు కూడా ఉన్నారు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు వదిలి నేతలైనవారు లేకపోలేదు.. ఈ మధ్యే […]
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోంది.. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారు.. ప్రజల కోసం పని చేసే వారికే అభ్యర్థులుగా నిలబెట్టాం అని… ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారు.. పార్టీ భావజాలాన్ని అర్థం […]
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖాదర్ తో కలిసి కూతుర్ని హత్య చేసింది హీనా బేగం.. మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేయించారు.. ఢిల్లీ, ముంబై, జైపూర్ లో పిల్లలతో బెగ్గింగ్ చేశాయించారు ఖాదర్, హీన.. చిన్నారి బేబీ మెహక్.. నేను బెగ్గింగ్ చేయను అంటూ మారం చేసింది.. నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ గొడవ చేసింది.. […]
ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఏపీ డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది.. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్ల పాటు ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈఆర్సీ.. సెప్టెంబర్ 2024 నాటికి 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2025 నాటికి మరో 3 వేలు, సెప్టెంబర్ 2026 నాటికి […]